గోవాలో పెను సంచలనం సృష్టించిన పర్ఫ్యూమర్ డిజైనర్ మోనికా గర్డే హత్యలో పోలీసులు నిందితులను గుర్తించారు. మృతురాలికి చెందిన ఏటీయం కార్డును దొంగలించిన నిందితులు సంఘటనా స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి డబ్బు డ్రా చేశారు. అయితే ఈ క్రమంలో ఏటీయం కేంద్రంలో వున్న సీసీటీవీ కెమెరా వారిని బంధించింది. అదే ఏటీఎంతో మరోసారి బెంగళూరులో డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. అయితే, ఆ ఇద్దరు ఎవరనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంతవరకు అధికారికంగా బయటకు చెప్పడం లేదు.
ఇప్పటికే గోవాలోని పోలీసు బృందం నిందితులకోసం బెంగళూరుకు బయలుదేరింది. ఇప్పటికే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. గోవాలోని తన ఫ్లాట్ లో మోనిక హత్యకు గురైన విషయం తెలిసిందే. వివస్త్రను చేసి చేతులు కట్టేసి మరీ నిందితులకు ఈ హత్యకు పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని బట్టి ఆమెపై లైంగికదాడి కూడా జరిగిఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పోస్టు మార్టం నివేదికలో ఆమెకు ఊపిరి ఆడకుండా చేయడం వల్ల చనిపోయిందని తెలిసింది.
అయితే, ఆమెపై లైంగిక దాడి విషయంలో వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె శరీరంపై కొన్ని గుర్తులను గమనించిన గోవా మెడికల్ కాలేజీ వైద్యులు ఒక నిర్దారణకు రాలేకపోయారు. దీంతో మరింత స్పష్టతకోసం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కాగా, ఆమెకు తెలిసిన వాళ్లే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more