కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి తన శక్తికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమానికి మద్దతునిచ్చిన పార్టీలను, రాజకీయ నేతలపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టిందని ఆయన తూర్పారబట్టారు. కావు ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మద్దతునిచ్చాయని చంద్రబాబు సర్కార్ ప్రశ్నించే తీరుపై ఆయన మండిపడ్డారు. కాపులే కావు ఉద్యమానికి మద్దత్తునివ్వాలా..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో పత్రిపక్ష నేతగా వున్న సయయంలో తన బావమరిదిని రక్షించుకోవడానికి, ఆయన్ను చట్టం ఉచ్చు నుంచి తప్పించడానికి దిగజారిపోలేదా అని విమర్శించారు.
కాపు ఉద్యమం పుట్టిందే చంద్రబాబునాయుడి వల్లనే అని, ఉద్యమానికి మూల కారకుడు ఆయనేనని ముద్రగడ వ్యాఖ్యానించారు. "మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయి. ఎప్పుడూ నోటి నుంచి రాని పదాలు కూడా వస్తున్నాయి. మీరు మహా అయితే నన్ను ఆపేందుకు ఆఖరి అస్త్రంగా నా బట్టలు ఊడదీయించి, పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారు. నన్నేమైనా చేసుకోండి. గతంలో మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని.. అప్పటిదాకా ఊరుకోబోను" అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధైర్యముంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగాలని ముద్రగడ సవాల్ విసిరారు. హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే, తాను కూడా ఆ క్షణం నుంచి దీక్షను ప్రారంభిస్తానని, చంద్రబాబు పక్కనే కూర్చుంటానని చెబుతూ, అప్పుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో, ఎవరి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. తాను చేస్తున్న దీక్షలను దొంగదీక్షలన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉప్పుడు చంద్రబాబు కూడా దీక్షలు చేశారని గుర్తు చేసిన ఆయన, అవి కూడా దొంగ దీక్షలేనా? అని ప్రశ్నించారు. సమాజంలో వెనుకబడిపోయిన కాపుల భవిష్యత్తు బాగుండాలని తాను ఉద్యమాలు చేస్తుంటే, వాటిని అణచి వేయాలన్న ఉద్దేశంతో కాపులతోనే తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more