దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలు నట్టనడివీధిలో రోడ్డుపై ప్రజలందరూ వెళ్తున్న క్రమంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతి పట్ల కత్తితో దాడి చేశాడు. అంతటితో అగని దుండగుడు ఏకంగా మఅెపై 22 సార్లు పొట్టలో కత్తిపోట్లు పొడిచాడు. అయినా అమెపై పగ చల్లారని దుర్మార్గుడు అమె తలను కాలితో తన్నాడు. ఈ దారుణాన్ని అటుగా వెళ్తున్న వాళ్లను నిర్ఘంతపోయేలా చేసింది.
అయితే ఈ దారుణాన్ని ఎంతో మంది చూసినా బాధితురాలిని కాపాడే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సరైన సమయంలో సమాచారం అందించలేకపోయారు. కనీసం రక్తమోడుతున్న భాదితురాలని అస్పత్రికి తరలించేందుకు కూడా ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రజల కర్కషత్వానికి మళ్లీ ఓ అబల మృతి చెందింది. దేశరాజధానిలో అబలలపై జరుగుతున్న అకృత్యాలు యావత్ ప్రపంచంలోనే దేశం ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నా.. పోలీసులు మాత్రం చేష్టలుడికి చూస్తున్నారన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఢిల్లీలోని బరోరీ ప్రాంతంలో నివసిస్తున్న కరుణ (21) అనే అమ్మాయిని పక్కింట్లో నివసిస్తున్న 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను నిత్యం ప్రేమ పేరుతో వేధించేవాడు. అయినా అమె అతని వేధింపులను లైట్ గా తీసుకుంది. స్థానికంగా గల నోవెల్ రిచస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కరుణను యధావిధిగా వెంబడించాడు సురేందర్. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రశ్నించాడు.
అమె అతడి మాటలను పెడచెవిన పెట్టి స్కూలుకు వెళ్తుండగా, అమెపై కత్తితో దాడి చేశాడు. 22 సార్లు అమె పొట్టలో కత్తితో పొడిచి చంపేశాడు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చేయించారు తప్ప ఎలాంటి చర్య తీసుకోలేదు. సురేందర్కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా.. అక్కడ కేసు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more