లిక్కర్ కింగ్ గా పేరొంది.. ఉద్దేశ పూర్వక బ్యాంకుల రుణ ఎగవేతదారుగా మారి.. అర్థిక నేరస్థుడిగా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు ఈడీ మరోమారు షాక్ ఇచ్చేందుకు దృష్టిసారించింది. బ్యాంకులతో సెటిల్ మెంటు డ్రామాలను నడిపి తప పబ్బం గడుపుకుందామని భావించిన ఆయనకు చెందిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఈడీ రెండు దఫాల్లో మాల్యాకు చెందిన రూ.8,401 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
తొలి విడతగా రూ.6 వేల కోట్లకు ఆ తరువాత 2 వేల 4 వందల కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీలను అటాచ్ చేసింది. మూడో దఫాలోనూ వేల కోట్లలో ఆస్తులను స్తంభింపజేయవచ్చని, ఈసారి అటాచ్ చేయబోయే వాటిలో విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటివరకు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారంగా అటాచ్మెంట్ జరుపగా.. ఈసారి మాత్రం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా జప్తు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బ్యాంకులకు రూ.9000 కోట్లకు పైగా ఎగవేసిన కేసులో ఇప్పటికే పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతో ముంబై కోర్టు మాల్యాను ఘోషితాపరాధిగా ప్రకటించింది. తను భారత్కు తిరిగి రావాలనుకుంటున్నప్పటికీ ప్రభుత్వం తన పాస్పోర్టును రద్దు చేసిన కారణంగా వీలుకావట్లేదని రెండ్రోజుల క్రితం ఢిల్లీ సిటీ కోర్టుకు మాల్యా విన్నవించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది ఈ విషయాన్ని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి సుమిత్ దాస్ ముందు వెల్లడించారు. ఫెరా చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గతంలో జారీ అయిన సమన్లను బేఖాతరు చేసినందుకు మాల్యాపై కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Mar 03 | ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది.... Read more
Mar 03 | రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవలంబిస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వలసలు వస్తాయని వైసీపీ రాజ్యసభ... Read more
Mar 03 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన... Read more
Mar 03 | ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద గస్తికాస్తున్న పోలీసులు ఒడిశా నుంచి విశాఖపట్నం వైపుకు వెళ్తున్న ఓ కారు నిలిపి వీళ్లు గంజాయిని ఏమైనా తరలిస్తున్నారా అన్న అనుమానంతో చెక్ చేయగా.. వారికి... Read more
Mar 03 | ఒకనాటి ప్రేమ తాను ప్రేమించిన వ్యక్తి సుఖాన్ని కోరుకునేది.. కానీ ఇప్పటి ప్రేమ తన ప్రేమను అంగీకరించికపోయినా.. దూరం పెట్టినా ప్రతికారంతో రగలిపోయేదిగా మారింది. ప్రేమ గుడ్డిది అన్న మాటలను నిజం చేస్తూ ఎవరో... Read more