లిక్కర్ కింగ్ గా పేరొంది.. ఉద్దేశ పూర్వక బ్యాంకుల రుణ ఎగవేతదారుగా మారి.. అర్థిక నేరస్థుడిగా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు ఈడీ మరోమారు షాక్ ఇచ్చేందుకు దృష్టిసారించింది. బ్యాంకులతో సెటిల్ మెంటు డ్రామాలను నడిపి తప పబ్బం గడుపుకుందామని భావించిన ఆయనకు చెందిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఈడీ రెండు దఫాల్లో మాల్యాకు చెందిన రూ.8,401 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
తొలి విడతగా రూ.6 వేల కోట్లకు ఆ తరువాత 2 వేల 4 వందల కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీలను అటాచ్ చేసింది. మూడో దఫాలోనూ వేల కోట్లలో ఆస్తులను స్తంభింపజేయవచ్చని, ఈసారి అటాచ్ చేయబోయే వాటిలో విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటివరకు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారంగా అటాచ్మెంట్ జరుపగా.. ఈసారి మాత్రం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా జప్తు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బ్యాంకులకు రూ.9000 కోట్లకు పైగా ఎగవేసిన కేసులో ఇప్పటికే పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతో ముంబై కోర్టు మాల్యాను ఘోషితాపరాధిగా ప్రకటించింది. తను భారత్కు తిరిగి రావాలనుకుంటున్నప్పటికీ ప్రభుత్వం తన పాస్పోర్టును రద్దు చేసిన కారణంగా వీలుకావట్లేదని రెండ్రోజుల క్రితం ఢిల్లీ సిటీ కోర్టుకు మాల్యా విన్నవించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది ఈ విషయాన్ని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి సుమిత్ దాస్ ముందు వెల్లడించారు. ఫెరా చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గతంలో జారీ అయిన సమన్లను బేఖాతరు చేసినందుకు మాల్యాపై కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more