గుజరాత్ ఎడారిగా మారుతుందన్న బలమైన కారణం నేపథ్యంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హాదాను కేంద్రం కల్పించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అరోపించారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వడం లేదన్న అంశంపై తన మనసులోని అనుమానాన్ని ఉండవల్లి బయట పెట్టారు. "దీని వెనుక ఓ పెద్ద విషయం ఉందన్నది నా అనుమానం మాత్రమే. నేను పర్సనల్ గా ఫీలయ్యేది ఏంటంటే... విభజన నాడు మోదీగారు లేరు. ఇప్పుడాయనకు ఓ సమస్య ఉంది.
రాష్ట్రానికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే, కేజీ బేసిన్. కేజీ బేసిన్ లో ఇంకా గ్యాస్ నిల్వలు, గుర్తించనివి చాలా ఉన్నాయి. వీటి విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇండస్ట్రీ అంతా కూడా... ఈ రిలయన్స్ అంతా కూడా గుజరాత్ తీరంలో ఉన్నాయి. ఇక్కడ గనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్, నో ఎక్సైజ్ డ్యూటీ అంటే, వాళ్లందరూ వచ్చి ఇక్కడ పెడతారండీ. ఇక మోదీ రాష్ట్రంలో పరిశ్రమలు మిగలవు. కాకినాడ, వైజాగ్ కలిసిపోతాయి. ఈ ఐదేళ్లలో టాక్స్ ఎగ్జంప్షన్స్ తో ఓ 20 పర్సెంట్ లాభం పొందుతారు. కోటి రూపాయలు పెడితే ఓ 20 లక్షలు ఉట్టినే లాభం వస్తుందన్నారు.
గుజరాతీ వాళ్లు పెద్ద వ్యాపారస్తులు. వారు ఆకర్షింపబడతారు. టక్ మని మొత్తం అందరూ ఇక్కడకు షిఫ్టయిపోతారు. అందుకని స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆపేశారా? అన్నది తన వ్యక్తిగత అనుమానమన్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోడీ, అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, బీజేపి అధ్యక్షుడు అమిత్ షా ఇలా కేంద్రంలో వున్న పెద్దలందరూ గుజరాత్ కు చెందినవారు కావడం కూడా ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా చేస్తుంది తప్ప,, 14వ ఫైనాన్స్ కమీషన్ కాదని అయన అన్నారు, తాను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా పనిచేశాను కాబట్టి, ఇక్కడున్న నిల్వల విలువ తెలుసు. ఇదే మనకు పెద్ద అసెట్. రేపు రాబోయే రోజుల్లో వీటిని సరిగ్గా వాడుకోగలిగితే ఏపీకి తిరుగుండదు. ఈ అమరావతి, రాజధానిని కట్టక్కర్లేదండీ" అని ఉండవల్లి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more