రెండున్నరేళ్లయినా ప్రధాన మంత్రి దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీకి విదేశీ పర్యటనలకే సమయం సరిపోవడం లేదని, ఇక అయన దేశ ప్రజల సమస్యలను ఎలా తీర్చుగలరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందుకు విదేశాల్లోని నల్లడబ్బును తీసుకువచ్చి.. దేశ ప్రజల ప్రతీ ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయల మేర వేస్తానని చెప్పిన మోడీ కోసం ప్రజలు వేచిచూస్తున్నారని వ్యంగస్త్రాలు సంధించారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలరోజల పాటు 223 శాసనసభ నియోజకవర్గాలను మీదుగా కొనసాగనున్న రాహుల్ 'డియోరియా టు ఢిల్లీ' యాత్రలో భాగంగా యూపీలోని ఖేటసారియాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు, ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ గుప్పించిన హామీలను నేరవేర్చలేదమని నిలదీశారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎంతగానో ఎదరుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇక దేశంలోకి బుల్లెట్ రైళ్లను తీసుకువస్తానని హామీ కూడా రెండున్నరేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదని మండిపడ్డారు,
ఇక పనిలోపనిగా సమాజ్వాదీ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లోనూ ప్రజలు ఓట్లేసి గెలిపించిన సైకిల్ (సమాజ్వాదీ పార్టీ సింబల్) ముందుకు కదలట్లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఏనుగు(బీఎస్పీ ఎన్నికల గుర్తు)ను తొలగించి సైకిల్కు అధికారం ఇస్తే అది కదలటం లేదన్నారు. సైకిల్ పంచరైందో లేక విరిగిపోయిందో తెలియదుగాని అది మాత్రం కదలడం లేదంటూ ప్రజల కేరింతల మధ్య రాహుల్ ప్రసంగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more