రాజకీయాల్లో తనను ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారనే వార్తలను పవన్ ఖండించారు. నన్ను ఒకరు నడిపించాలా? నాకు పౌరుషం లేదా? ప్రజా సమస్యలే నాకు గాడ్ ఫాదర్ అంటూ అనగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు తన సొదరులని చెప్పిన పవన్ తెలంగాణ హిస్టరీ, ఉద్యమం గురించి చెప్పుకొచ్చాడు. ఓవైపు హైకోర్టు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తే... ఇంకోవైపు ప్యాకేజీ అంటూ హోదా ఇవ్వకుండా నవ్యాంధ్రను మోసం చేశారని ఆక్షేపించారు.
"మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ వంటి పదాలు మన డిక్షనరీలోకి కొత్తగా వచ్చాయి. వీటిని మాట్లాడేముందు మన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో మనకు సరైన న్యాయం జరగకపోతే, అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజులకు పైగా నిరాహారదీక్ష చేసి మనం సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆరోజున తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లో. కానీ, ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమరం వేడుకలు జరుగుతూ ఉంటే... ఇక్కడ మనం తెలంగాణ గురించి తెలుసుకోవాలి. వాళ్లు మన సోదరులు, అన్నదమ్ములు. వాళ్లూ మన ఆడపడుచులు, బిడ్డలు. తెలంగాణలో అప్పుడు నిజాం నిరంకుశ పాలన సాగింది. రజాకార్లు దోపిడీలు చేశారు. మానభంగాలు చేశారు. తెలుగుభాషను నేర్చుకోనివ్వకుండా చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు. ఆ సమయంలో అన్నదమ్ముల్లా ఉంటారని ఏపీని తెలంగాణను కలిపారు. ఆపై రెండు దశాబ్దాల తరువాత, ఏదైతే విధివిధానాలతో కలిసుండాలని అనుకున్నారో... అది చేయకపోయే సరికి జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. దాన్ని కేంద్రం సమాధాన పరిచింది" అంటూ గత చరిత్రను చెప్పుకొచ్చాడు.ఆ సందర్భంగా స్నేహితుడు - సన్ని హితుడు - తెలంగాణ కవి మాస్టర్ జీ పేరు ప్రస్తావిస్తూ ఓ పాటను పవన్ ఆలపించాడు.
ఆపై సమస్య మరింతగా పెరిగిందని, రాష్ట్రం విడిపోతే తమ ఉద్యోగాలు తమకే దక్కుతాయన్న భావనతో తెలంగాణ నేతలు, యువత ఉద్యమించారని గుర్తు చేశాడు. అ సమయంలోనే జరిగిన నేటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పాడు. తెలంగాణలో ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసిన వారికి ఆనాటి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పి, రాష్ట్రాలను విడగొట్టేది లేదని స్పష్టం చేశారు. కానీ, అదే 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, అదే విధానాన్ని ఎందుకు కాపాడుకోలేక పోయారని ప్రశ్నించారు? అవకాశవాదపు రాజకీయాలు కాంగ్రెస్ చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంత యువకులకు ఇబ్బందులు వచ్చాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ ఫోటోలకు, విగ్రహాలకు దండలు వేయటం కాదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చాడు. రాష్ట్రానికి హోదాను ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలూ అంగీకరించాయని, దానికి కూడా విలువ లేదా? అంటూ పవన్ ప్రశ్నించాడు. 'సిగ్గు తెచ్చుకోండి మీరు' అంటూ మాట్లాడారు.
తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల సన్నాసులు, చవటలు అని గతంలో అన్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు కనీసం ఒక్కసారైనా ఇది సరికాదని మాట్లాడిన పాపాన పోలేదని వారిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజన చేసిందని, ఇది తనను ఎంతో వేదనకు గురించేసిందన్నారు. విభజన తీరుకు బాధపడి 11 రోజులు అన్నం మానేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 42 ఏళ్ల తర్వాత బయటకు పొమ్మన్నప్పుడు బాధ ఉండదా? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని, వెనుకబడ్డారన్న విషయంలో కొంత వాస్తవం ఉందని ఆయన అన్నారు. అయితే అందుకు సీమాంధ్ర నాయకులను మాత్రమే తప్పుపట్టడం సరికాదన్నారు. జైపాల్రెడ్డి, జానారెడ్డి వంటి తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వంలో పదవులు చేపట్టిన తెలంగాణ నేతలు ఉన్నారు. వారికి కూడా బాధ్యత ఉంది కదా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే తనకు ప్రేమ ఉందని, ప్రజల కష్టాలను చాలా దగ్గరగా చూశానని అన్నారు. అయితే అడ్డగోలు విభజన, ఏపీకి హోదా ఇస్తామని చెప్పి కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని, ఆ లడ్డూలు వారి ముఖానికే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more