ఏపీ అసెంబ్లీ రెండో సమావేశాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యేక హోదాపై తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ, వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి స్పీకర్ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో వారిని మార్షల్స్ గట్టిగా అడ్డుకోగా, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తొలుత సభలో గందరగోళం చెలరేగగా, స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ, వైకాపా సభ్యుల తీరు ఎంతమాత్రమూ మారలేదు. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అని నినాదాలు చేస్తూ, పేపర్లను చించి స్పీకర్ పై వేస్తూ కొందరు, కెమెరాలను వెనక్కు నెట్టివేస్తూ మరికొందరు, బెంచీలెక్కి నినాదాలు చేస్తూ ఇంకొందరూ తమ నిరసనలు తెలిపారు.
పోడియంను చుట్టుముట్టిన ఎమ్మెల్యేలు కెమెరాలను పడదోసి, స్పీకర్ మైక్ ను విరిచేసి, మార్షల్స్ ను నెట్టేశారు. వాస్తవానికి అసెంబ్లీలో నిరసన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నిబంధన ఉన్నప్పటికీ, ఈ దృశ్యాలన్నీ లైవ్ అవుతున్నాయి. స్పీకర్ కుర్చీ దగ్గరకు వెళ్లేందుకు తీవ్రంగా యత్నించిన వైకాపా ఎమ్మెల్యేలను మార్షల్స్ సైతం గట్టిగానే అడ్డుకున్నారు. ఒక దశలో స్పీకర్ కొడెలను కొట్టేంత పని చేశారని మహిళా నేత పీతల సుజాత వ్యాఖ్యానించడం విశేషం.
ఈ క్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మార్షల్స్ ను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏకంగా స్పీకర్ ముందున్న మైక్ ను అందుకుని దాన్ని లాగి పారేశారు. ఆ తరువాత రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, ఆళ్ల బెంచీలపైకెక్కి నినాదాలు చేశారు. ఈ దృశ్యాలన్నింటినీ తెలుగు టీవీ చానళ్లు పదే పదే చూపిస్తున్నాయి.దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కోడెల, మరోసారి సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more