ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసిన కేంద్రం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి రాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ముగిసేదాకా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా పరిశీలించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఆ తర్వాత విజయవాడలో మీడియా సమావేశంలో తన స్పందనను తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించి ఉంటేనే తమకు సంతోషం కలిగేదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తాజాగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘‘ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఇస్తామని ఈ రోజు ప్రకటించిన వాటన్నింటికీ చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. వాటన్నింటికీ సంబంధించి తక్షణం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు సంతోషం. కాదు.. అందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. హోదాతో రాగల మొత్తానికి సమానమైన మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఏమిస్తారో స్పష్టంగా చెప్పండి. చెప్పిన దానికి కట్టుబడి సత్వరంగా ఆ నిధులు ఇవ్వండి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ‘‘పవన్ కల్యాణ్ మొన్న మాట్లాడారు. ఈ రోజు ఆయన కూడా కేంద్ర మంత్రుల ప్రకటన చూసే ఉంటారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో... ఎలా స్పందిస్తారో చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా నాకు ఓకే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more