నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది. ఇక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్న కేంద్రం ఆర్థిక సాయం విషయంలోనూ క్లారిటీని ఇవ్వలేకపోయింది. గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడుతుందని భావించిన ఐదు కోట్ల అంద్రుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇక ఇవాళ ఉదయం నుంచి ప్యాకేజీ విషయంలో రేకెత్తిన్న ఉత్కంఠ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వుంది. కాగా ఏపీ ప్రత్యేక ప్యాకేజీలపై అన్ని వివరాలను తమ వెబ్ సైట్లో రేపు పొందుపరుస్తామని చెప్పడం.. పోలవరం ప్రాజెక్టుకు నూరు శాతం నిధుల్ని అందిస్తామని విషయాలే కొత్తగా వున్నాయి.
ఈ మేరకు ఇవాళ ఇప్పుడా.. అప్పుడా అంటూ ఉత్కంఠ రేపి చివరకు రాత్రి పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి అందించాల్సిన సహాయ, సహకారాలపై కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నామని..రాష్ట్ర విభజనతో అటు పారిశ్రామికంగా, ఇటు రెవెన్యూ పరంగా ఏపీ నష్టపోయిందన్నారు. నాలుగు అంశాలను పరిశీలించి ఏపీని ప్రత్యేక ఆర్థిక స్తాయిని కల్పించాలని భావించామన్నారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు, 14వ అర్థిక సంఘం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన, నీటి అయోగ్ సిఫార్సుల మేరకు ఏపీని అన్ని విధాలా అదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు.
ఈ తరుణంలో రాష్ట్ర పునర్విభజ చట్టంలోని అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని జైట్లీ తెలిపారు. అనేక విద్యా సంస్థలను ఇప్పటికే ప్రకటించామని జైట్లీ అన్నారు. కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయని జైట్లీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని జైట్లీ అన్నారు. 2014 అర్థిక సంవత్సరం ప్రారంభం (అనగా ఏప్రీల్ 1) నుంచి పోలవరం ప్రాజెక్టుకు...అయిన ఖర్చు కూడా కేంద్రమే చెల్లిస్తుందని జైట్లీ చెప్పారు. పోలవరానికి సంబంధించిన రెండు నాబార్డు ద్వారా రుణాన్ని అందించి ఆ తరువాత కేంద్రం ఆ రుణాలను తీర్చేవిధంగా యోచిస్తున్నామని చెప్పారు.
రెవెన్యూలోటుకు సంబంధించి 14వ ఫైనాన్స్ కమిషన్ ఆమోదించిందని జైట్లీ చెప్పారు. మొదటి రెండేళ్ల రెవెన్యూ లోటును ఇప్పటికే చెల్లించామన్నారు. ప్రత్యేక హోదా ఏ ప్రాంతాలకు వర్తిస్తుందన్న విషయంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్యాకేజీ ప్రకటన గురించి మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా అనేది కేవలం కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలకే వర్తించాలని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని నిశితంగా చర్చించామన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల వల్ల సాధ్యపడలేదని అరుణ్ జైట్లీ చెప్పారు.
ప్రత్యేక హోదా కాకుండా దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించే విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు. రైల్వేజోన్, నియోజకవర్గాల పునర్విభజన సహా అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయని జైట్లీ చెప్పారు. పన్ను మినహాయింపులకు సంబంధించిన నోటిఫికేషన్ కాసేపట్లో విడుదల చేస్తామని జైట్లీ అన్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అంశాలు తుది దశలో ఉన్నాయని జైట్లీ తెలిపారు. రెవెన్యూ లోటు, పన్ను మినహాయింపులకు సంబంధించిన తుది వివరాలను నీతి ఆయోగ్, ఏపీ ప్రభుత్వం చర్చించి నిర్ధారించుకుంటాయని జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2,500 ఇచ్చామని ఆరుణ్ జైట్లీ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more