ఏపీ స్టేటస్ పై నేడే ప్రకటన | central announces AP special package today

Central announces ap special package today

Arun Jaitley and venkaiah naidu, AP special package, central announcement on AP special status, AP special staus

central announces AP special package today. Arun Jaitley and venkaiah naidu makes the announcement.

ఏపీ స్పెషల్ పై నేడే ప్రకటన... భారీ ప్యాకేజీ?

Posted: 09/07/2016 09:18 AM IST
Central announces ap special package today

ప్రత్యేక హోదా పై ఆశలు పెట్టుకున్న నవ్యాంధ్ర విషయంలో నేటి మధ్యాహ్నాం కేంద్రం ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ప్యాకేజీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు హోదాకు తగ్గ స్థాయిలో ఈ ప్యాకేజీ ఉండబోతుందట.

ఇక స్టేటస్ అంశాన్ని పూర్తిగా పక్కన బెట్టిన కేంద్రం ప్రకటించబోయే వరాల విషయానికొస్తే... పన్నుల సాయంతోపాటు అవసరాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. పోలవరం విషయంలో 90 శాతం ఖర్చులు భరించడం, అందుకు తగ్గ నిధులు అందజేయటంతోపాటు నాబార్డు కింద తొలిరుణం 19వేల కోట్లు ప్రకటించనుందట. ఏపీకి ఏటా 3 వేలా కోట్ల గ్రాంట్ అందజేసే యోచనలో కేంద్రం ఉంది. అంతేకాదు పారిశ్రామిక నిధి స్థానంలో రాయితీలు భారీ కల్పించటంతోపాటు ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనుంది.

కీలకమైన రైల్వే జోన్ ను కూడా విశాఖ నుంచి విజయవాడకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్లేస్ లో రాబోతున్న ఈ ప్రకటన కోసం ఏపీ ప్రజలంతా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP special package  Arun Jaitley  venkaiah naidu  

Other Articles