టీవీ చానెళ్ల రేటింగ్ ల కోసం అందమైన యాంకర్లను వాడటం ఎక్కడైనా కామనే. కూర్చోని బులిటెన్లు చదివే వారికి చక్కని గొంతు, అందమైన ముఖవర్చస్సు మాత్రమే ఉంటే సరిపొద్దనుకుంటే పొరపాటే. కానీ, అక్కడ మాత్రం ఖచ్ఛితంగా నాజూగా ఉండి తీరాలన్న కండిషన్ పెట్టారు. ఫలితం 8 మంది మహిళా యాంకర్లను సస్పెండ్ చేశారు.
ఈజిప్ట్ లో మూడేళ్లుగా మిలిటరీ ఆధ్వర్యంలో పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి చానెళ్లలో పని చేస్తున్న మహిళా యాంకర్లపై ఇప్పుడు వేటుపడింది. టీవీలో కనిపించాలంటే నాజూగ్గా, అందంగా ఉండాలని, మీలాంటి వారిని చూడాలని ప్రజలను అనుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈజిప్టు ప్రభుత్వ చానల్ 8 మంది మహిళా ఉద్యోగులను తొలగించింది. నెలరోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది.
లావుగా ఉన్న యాంకర్లను తొలగించడంపై ఇప్పుడు ఈజిప్టు టీవీ చానళ్లు పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని పలువురు పేర్కోంటున్నారు. ఈఆర్టీయూపై నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని చానెల్ చెబుతోంది. వారు సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని అంటోంది. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ఇక సదరు యాంకర్ లు ఈ నిర్ణయం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని, నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని ఓ యాంకర్ పేర్కొంది. ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఇంకో యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది. టీవీ యాజమాన్యం చర్యతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది. ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్నెస్ చానల్ చర్యను ఖండించింది.స్థూలకాయం ఎంతటి చేటు తెస్తుందో ఆ టీవీ యాంకర్లకు ఇప్పుడు తెలిసొచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more