రియో ఒలింపిక్స్లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో మట్టి కరిపించి భారత్కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. తొలుత ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్ (మంగోలియా)పై గెలుపొందింది. ఆపై క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓటమి చెందింది. కానీ సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ కొబ్లోవా ఫైనల్కు చేరుకోవడంతో భారత రెజ్లర్కు మరోసారి ‘రెప్చేజ్’లో పోటీపడే అవకాశం వచ్చింది. దీంతో అదృష్టం ఈ లేడీ సుల్తాన్ ను కాంస్యం రూపంలో వరించింది.
ఎవరీ సాక్షి:
23 ఏళ్ల సాక్షిమాలిక్ 1992 సెప్టెంబర్ 3న హర్యానా రోహతక్ లోని మెక్రా గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. 12 ఏళ్ల వయసు నుంచే కుస్తీ పోటీల్లో పాల్గొనటం ప్రారంభించింది. గురువు ఈశ్వర దాహియా శిక్షణలో చోటు రామ్ మైదానంలో రాటుదేలింది. అక్కడ చాలా మంది అబ్బాయిలు రెజ్లింగ్ అమ్మాయిలకు కాదని సాక్షిని గేలి చేసేవారంట. ఈ విషయంలో కోచ్ దాహియాకు చాలాసార్లు అవమానాలు కూడా ఎదరయ్యాయంట. అయినా వినకుండా పట్టుదలతో ఆమెకు సాధన ఇచ్చాడాయన. 2010 లో 18 ఏళ్ల ప్రాయంలో తొలిసారి జూనియర్ లెవల్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి ఆపై తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంచింది. 2014 కామన్ వెల్త్ క్రీడల్లో సిల్వర్ పతకం సాధించడంతోపాటు గతేడాది సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంఫియన్స్ షిఫ్ గేమ్స్ లో పాల్గోని కాంస్య పతకం గెలుపొందింది.
2015లో అంతర్జాతీయ చాంపియన్ షిప్ లో పాల్గొని రియో ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. ఆశలు పెట్టుకున్న వారు ఒక్కోక్కరుగా నిష్క్రమిస్తున్న తరుణంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాక్షి పతకం సాధించడం నిజంగా విశేషం. 1.62 ఎత్తు, 64 కేజీల సాక్షి ఒలింపిక్స్లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా సాక్షి మాలిక్ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ(2000, సిడ్నీ), బాక్సర్ మేరీకోమ్(2012, లండన్), షటర్ల్ సైనా నెహ్వాల్(2012, లండన్).
మాలిక్ విజయం సాదించిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడాకారులకు సాక్షి మాలిక్ మార్గదర్శకురాలిగా నిలిచిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైజ్ మనీ:
కాగా, ప్రస్తుతం హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హర్యానా ప్రభుత్వం 2 కోట్ల ప్రౌజ్ మనీతోపాటు భూమి, ఇండియన్ రైల్వేలో ఉద్యోగంతోపాటు 50 లక్షలు, ఇండియన్ ఒలంపిక్స్ అసోషియేషన్ నుంచి 20 లక్షలు, జెఎస్ డబ్ల్యూ గ్రూప్ నుంచి 15 లక్షలతోపాటు సల్మన్ ఖాన్ ప్రకటించిన 1 లక్ష రూపాయలు సాక్షి సొంతం కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more