భారతీయ రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ కేంద్రం మంగళం పాడునుంది. స్వాతంత్ర్యానికి ముందు నుంచి అమలువుతున్న విధానానికి చెక్ పడనుంది. రానున్న అర్థిక సంవత్సరం నుంచి పార్లమెంటులో రైలు కూత వినపించకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అయితే రైల్వే శాఖ చేస్తున్న అభివృద్ది పనులు, కోత్త లైన్లు, కోత్త ప్రాజెక్టుల వివరాలన్నింటికీ మాత్రం పార్లమెంటులో సభ్యులు ముందు వుంచుతారు. అయితే ప్రత్యేక బడ్జెట్ లో కాకుండా సాధారణ బడ్జెట్ లోనే వీటిని కూడా పోందుపర్చనున్నారు.
సాధారణ బడ్జెట్లో రైల్వేలను చేర్చడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించడంతో ఇక రైల్వే ప్రత్యేక బడ్జెట్ కు కేంద్రం తిలోదకాలు ఇవ్వనుంది. దీంతో 1924 నుంచి అమలవుతున్న విధానానికి 2017లో తెరపడబోతోంది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కలిపేందుకు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమించినట్లు సమాచారం. 1996 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుండటంతో రైల్వే మంత్రులు తమ సొంత ప్రతిష్ఠను పెంచుకోవడానికి, తమ రాష్ట్రాలకు తాయిలాలు ఇచ్చుకోవడానికి కృషి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
రైల్వే మంత్రులుగా రాష్ట్రాల్లో బలంగా ఉండే పార్టీల నేతలు పనిచేయడంతో ఆ పదవిని రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. రైల్వే బ్యూరోక్రసీ కూడా గుదిబండగానే మారింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రి పదవిని బీజేపీ నేత సురేశ్ ప్రభు నిర్వహిస్తున్నారు. అయితే గత రైల్వే మంత్రులకు భిన్నంగా సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టి, కీర్తిప్రతిష్ఠలు పొందడంపై దృష్టి పెట్టకుండా, దానిని ఆర్థిక శాఖకు అప్పగించడానికి మొగ్గు చూపారు. దాంతోపాటు బీజేపీకి లోక్సభలో తగినంత ఆధిక్యత ఉండటం కూడా కలిసొచ్చింది.
రైల్వే బడ్జెట్ను రద్దు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్, కిశోర్ దేశాయ్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై రాజ్యసభలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ, రైల్వేల దీర్ఘకాలిక భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని సాధారణ బడ్జెట్లో రైల్వేలను కలిపేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిపారు. ఈ విలీన ప్రక్రియ కాల పరిమితి గురించి ఆయన చెప్పలేదు. సాధారణ బడ్జెట్లో రైల్వేలను కలిపేయడం వల్ల రైల్వేలు ప్రభుత్వంలోని ఇతర శాఖలతో సమానమవుతాయి. బడ్జెట్ సహకారం లభిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ కూడా ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more