బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చుట్టూ మళ్లీ ఉచ్చు బిగిసుకుంటుందా..? అంటే అవుననే కనిపిస్తున్నాయి పరిస్థితులు. కృష్ణ జింకల వేట కేసు మరో ట్విస్టు ఏర్పడింది. గత కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన ఈ కేసులోని కీలక సాక్షి మళ్లీ తెరపైకి ప్రత్యక్షం కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జింకలను చంపింది సల్మాన్ ఖానేనని ఆనాడు జీపు డ్రైవర్గా ఉన్న హరీష్ దులానీ చెప్పడంతో కేసు మళ్లీ మొదటి వచ్చేలా కనబడుతోంది. 2002 నుంచి కనిపించకుండా పోయిన హరీష్ హఠాత్తుగా తెరపైకి వచ్చి ఈ కేసులో కండల వీరుడే నిందితుడని చెప్పాడు.
'నన్ను చంపుతామని మా నాన్నను బెదిరించారు. దీంతో భయపడి జైపూర్ వదిలి పారిపోయాన'ని హరీష్ దులానీ చెప్పాడు. తనకు రక్షణ కల్పించివుంటే కోర్టులో సాక్ష్య చెప్పేవాడినని అన్నాడు. లిఖితపూర్వకంగా కోరితే అతడికి భద్రత కల్పిస్తామని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసుల కీలక సాక్షిగా వున్న హరీష్ దులానీ సాక్షం చెప్పేందుకు రాకపోవడంతో.. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రాజస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నిర్దోషగా ప్రకటించింది.
హరిష్ దులాని మళ్లీ తెరపైకి రావడం.. కృష్ణ జింకల వేట కేసులో ఆయనే దోషని చెప్పడంతో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ వెల్లడించారు. 1998లో జోధ్పూర్కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని 'సుల్తాన్' స్టార్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more