చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్ ఫర్ చేసిన ఫడ్నవీస్ | CM Devendra Fadnavis transfers dead Excise official

Cm devendra fadnavis transfers dead excise official

Devendra Fadnavis transfers dead Excise official, Maharashtra CM again in trouble, sandeep maruthi transfer,

Maharashtra CM Devendra Fadnavis transfers dead Excise official.

చచ్చిన అధికారిని ట్రాన్స్ ఫర్ చేసిన సీఎం

Posted: 07/20/2016 02:47 PM IST
Cm devendra fadnavis transfers dead excise official

తొందరపాటు నిర్ణయాలతో తరచూ చిక్కుల్లో పడుతుండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి విమర్శల పాలయ్యారు. మూడేళ్ల క్రితం మరణించిన ఓ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ను ఇప్పుడు బదిలీ చేస్తున్నట్లు స్వయంగా ఆయనే ఉత్తర్వులు జారీ చేయటంతో ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయన సందీప్ మారుతి అనే ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ను కోల్హాపూర్ నుంచి నాసిక్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు ఫైలుపై సంతకం చేశారు. ఆపై ఆయన మూడేళ్ల క్రితమే చనిపోయాడని తెలియటంతో నాలుక కరుచుకున్నారు. కాగా, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

కాగా, పొరపాటుకు కారణంగా పేర్కొంటూ ఓ క్లర్క్ ను సస్పెండ్ చేశారు. మూడేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంతో సందీప్ మరణించగా, కారుణ్య కోటా కింద ఆ ఉద్యోగం తనకు ఇప్పించాలని ఆయన భార్య అప్పటి నుంచి ప్రభుత్వాకార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  CM Devendra Fadnavis  transfer  dead official  transfer  

Other Articles