రాజకీయాల్లో దిగజారుడు వ్యాఖ్యలకు ఇది మరోక నిదర్శనం. బీఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అసభ్య పదజాలం వాడాడు. మంగళవారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మీడియా సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.
ఒళ్లు అమ్ముకునే వ్యభిచారిణి పని అంతా అయ్యాక డబ్బులు తీసుకుంటుంది. కానీ, మాయావతి అంతకంటే దారుణం. పార్టీ టికెట్లను ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటుంది. ఎవరైనా కోటి రూపాయలు ఇస్తానంటే వారికి సీటు అమ్మతుంది, ఆపై రెండు కోట్లు అంటే మొదటి వారిని కాదని రెండోవారికి అమ్మేస్తుంది. మూడు కోట్లు అంటే వారికి ప్రాధాన్యం ఇస్తుంది. మాయావతి కంటే వేశ్యలే నయం. కాన్షీరాం లాంటి మహానుభావుల పరువు తీసేందుకే ఆమె ఉంది అంటూ ఘాటుగా మాట్లాడాడు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నోటి కొచ్చినట్లు మాట్లాడిన ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బీఎస్పీ ప్రతినిధులు చెబుతున్నారు.
కాగా తనపై చేసిన వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. సింగ్ అసహనంతో అలా మాట్లాడుతున్నారని.. తమ పార్టీ బలోపేతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భాజపా జనరల్ సెక్రటరీగా ఉన్న దయాశంకర్ సింగ్ గత నెల ఉత్తరప్రదేశ్లో జరిగిన విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇక పెద్ద ఎత్తున్న విమర్శలు రావటంతో యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ చివరకు క్షమాపణలు చెప్పారు. నోరు జారానని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు. మాయావతి అంటే గౌరవమని చెప్పిన ఆయన, ఇకపై మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ముస్లింలకు దూరంగా ఉన్న బీజేపీ, ఆయన వ్యాఖ్యలతో, అణగారిన వర్గాలకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని భావించి దయాశంకర్ సింగ్ పై వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు యూపీ బీజేపీ అధ్యక్షుడు మౌర్య కాసేపటి క్రితం ప్రకటన చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more