బిహార్లో మావోయిస్టులు మళ్లీ పేట్రేగిపోయారు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో పోలీసు దళాలను ట్రాప్ లో ఇరికించి మరీ వారిపై కాల్పులకు తెగబడ్డారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తొలిసారిగా జరిగిన భీకర ఎన్కౌంటర్లో పది మంది భద్రతా దళ సభ్యులు మరణించారు. మావోల చర్యలను ప్రతిఘటిస్తూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా బిహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీకి చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.
మావోయిస్టులు తీవ్రస్థాయి ప్రతిఘటన చూపడంతో.. ఎన్కౌంటర్లో గాయపడిన జవాన్లను తీసుకురావడానికి పంపిన హెలికాప్టర్ పట్నాకు తిరిగి వచ్చేసింది. ఘటన స్థలంలో 17 అతిశక్తిమంతమైన ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పట్నాకు 172 కిలోమీటర్ల దూరంలో, ఔరంగాబాద్-గయా జిల్లాల సరిహద్దుల్లోని దుమారీ నాలా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంజీవ్ జీ సారథ్యంలోని నక్సల్ దళం సంచరిస్తున్నదన్న సమాచారంతో రెండు రోజులుగా ప్రత్యేక దళాలు గాలింపు జరుపుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
అది ఇది కేవలం పోలీసులను ట్రాప్ చేయడానికి మావోయిస్టులు అడిన నాటకంగా తెలుస్తుంది. మావోయిస్టుల ప్రభాల్యం ఉన్న ప్రాంతానికి అందులోనూ వారికి అనుకూలంగా ఉండే ప్రాంతానికి భద్రతా సిబ్బంది రప్పించిన మావోలు వారినే టార్గెట్ గా చేసుకుని ఐఈడీని పేల్చి.. తూటాలవర్షం కురిపించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మావోయిస్టుల ఉచ్చులోంచి తప్పించుకొనే క్రమంలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని వెల్లడించాయి. తప్పించుకొని పోయిన మావోయిస్టులను వేటాడే క్రమంలో కాల్పులు కొనసాగుతున్నాయని ఈ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more