నిధుల లేమితో నానా పాట్లు పడుతున్న ఏపీ నెత్తిన కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ వేసింది. ఇచ్చిన నిధులను సకాలంలో సద్వినియోగం చేయకపోతే, వాటిని వెనక్కి తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా 90 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు నివేదికను కేంద్రానికి పంపారు. అవకతవకలు అంతా ఉత్తదేనని పూర్తి వివరాలతో దానిని సమర్పించారు. అయితే అదే సమయంలో మరిన్ని నిధుల ఇవ్వాలంటూ విజ్నప్తి చేయటం కోసమెరుపు.
దీంతో మండిపోయిన కేంద్రం అదనపు నిధుల మాట పక్కనబెట్టి ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అంత బద్ధకమెందుకంటూ ఘాటుగా ఓ రిప్లై ఇచ్చింది కేంద్రం. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను త్వరగతిన వినియోగించుకోవాలని, పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకు తగిన నిధులను ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ పనులు ఆశించిన మేర వేగంగా సాగడం లేదన్నది కేంద్రం వాదన.
ఇంకోవైపు జాప్యానికి గల కారణాలను ఏపీ వివరిస్తున్నప్పటికీ వాటిపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేయటం లేదు. తమ అధికారులు వచ్చి పనులను పరిశీలిస్తారని, ఆలోపు కొన్ని లోపాలైనా సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా పనుల్లో వేగం నమోదు కాకపోతే, ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. నిధుల విడుదలలో కేంద్రం మీన మేషాలు లెక్కిస్తుందని ప్రభుత్వం ఆరోపిస్తున్న సమయంలో ఇలా రివర్స్ పంచ్ పడటంతో ఎలా చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు. ఈ మధ్యే ఆరోగ్య శాఖ నిధులపై తెలంగాణ ప్రభుత్వంపై కూడా కేంద్రం ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more