మాయమాటలతో యువతిని లోబర్చుకున్నాడు.. పెళ్లి పేరుతో అమెను లేవదీసుకుపోయాడు. ఆనక తన తల్లిదండ్రులు చూసిన వివాహం చేసుకునేందుకు సిద్దమై.. తనకు సర్వస్వం దారపోసిన యువతిని అమె గ్రామశివార్లలో వదిలి పారిపోయాడు. పెళ్లితో నమ్మించి, ఇంట్లో బంధించి యువతిపై ప్రతిరోజు అత్యాచారానికి పాల్పడిన ప్రబుద్దుడిని, అతని అక్కా, బావలను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరునెల్వేలి జిల్లా వన్నార్పేట్టై వాస్తవ్యుడైన ఇమ్మాన్యుయేల్ (24) తిరుపూరులోని ఒక మిల్లులో పనిచేస్తున్నాడు. అతని అక్క సెల్వి అమె భర్తతో కలసి మానూరు సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తోంది. అక్క ఇంటికి తరచూ వచ్చే ఇమ్మాన్యుయేల్కు ఆ గ్రామంలోని ప్లస్టూ చదువుతున్న బాలిక (17)తో స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమాయణంగా మారింది. అంతే ఆ బాలికను మాయమాటలతో నమ్మించిన ఇమాన్యూయల్.. గత నెల పదో తేదీన బాలికను తిరుపూరుకు తీసుకెళ్లి అక్కడి గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని అక్కడే ఒక ఇంట్లో కాపురం పెట్టాడు.
ప్రతిరోజూ పనికి వెళ్లేటప్పుడు బాలికను ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడు. రాత్రి తిరిగి వచ్చేవరకు బాలికను ఇంట్లోనే బందీగా ఉంచేవాడు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్కు అతడి తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. దీంతో బాలికను వదిలించుకునేందుకు మాయమాటలు చెప్పి ఈనెల 5వ తేదీన కారులో తీసుకెళ్లి ఊరి శివార్లతో వదిలి వెళ్లిపోయాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పి ఇద్దరూ కలిసి ఇమ్మాన్యుయేల్ అక్క ఇంటికి వెళ్లగా అక్క సెల్వి, ఆమె భర్త నటరాజన్ వీరిపై దాడిచేసి తరిమికొట్టారు. తిరునెల్వేలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more