వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపుతున్న రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోమారు అలాంటి వ్యాఖ్యలనే చేశారు. ఇరాక్ తన సామ్రాజ్యంలా భావించి.. తన నియంత పాలనను సాగించిన ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో మరోసారి సద్దాం హుసేన్ ను పోగిడారు. అయితే గతంలోనూ ఆయన సద్దాం హుసేన్, ఈజిఫ్టు అధ్యక్షుడు గఢాఫీలపై ప్రశంసలు కురిపించారు.
కాగా అమెరికాకు బద్దశత్రువైన సద్దాం పేరును మరోమారు ప్రస్తావించి.. ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. సద్దాం తన పాలనలో ఉగ్రవాదులను ఏరివేశారని, ఇది మంచిపరిణామని అన్నారు. ‘సద్దాం హుసేన్ చెడు వ్యక్తి. నిజామని భావిస్తున్నారా? ఆయన నిజంగా చెడు వ్యక్తే. అయితే ఆయన చేసిన ఓ మంచిపని గురించి మీకు తెలుసా? అంటూ ట్రంప్ తమ పార్టీ శ్రేణులను ప్రశ్నలడుగుతూ సమాధానాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూనే తన ప్రసంగాన్ని కోనసాగించారు.
సద్దాం చేసిన మంచిపనేంటి..? అంటే ఆయన టెర్రరిస్టులను చంపించాడు. ఉగ్రవాదుల వెన్ను భయంతో కంపించేలా అత్యంత దారుణంగా వారిపై కొరడా ఝుళిపించాడు. ముష్కరమూక తాము తీవ్రవాదులం అని చెప్పుకునేందుకు కూడా జంకేంతలా వారి పీచమణిచాడు అని ట్రంప్ అన్నాడు. ఆయన ఉగ్రవాదులతో అలాంటి కఠిన వైఖరిని అవలంభించడం మంచి పనే..? అవునా..? కాదా..? అని ప్రశ్నించాడు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల వైఫల్యంగానే అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించాడు.
ఇరాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదానికి ఇరాక్ హార్వర్డ్ యూనివర్సిటీలాంటిది. ఎవరైనా ఉగ్రవాది కావాలనుకుంటే ఇరాక్ వెళ్లాలి. నిజమే కదా? ఇది చాలా బాధాకరం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ గతంలోనూ సద్దాం, ఇతర నియంతలను ప్రశంసించారు. సద్దాం, గడాపీ వంటి నియంతలు ఇప్పటికీ అధికారంలో ఉంటే వందం శాతంగా మెరుగ్గా ఉండేదని అన్నారు. కాగా ఇరాక్ అధ్యక్షుడిగా సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అమెరికా దళాలు దాడులు చేసి, పదవీచ్యుతుడిని చేశాయి. యుద్ధ కోర్టులో సద్దాంను విచారించి ఆయనకు ఉరిశిక్ష విధించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more