తాను పనిచేస్తున్న సంస్థ ఆరుకాలాల పాటు చల్లగా వుండాలని, అప్పుడే తాము కూడా చల్లగా వుంటామన్నది సత్యం. అలా అలోచించే ఉద్యోగులు వారి ధోరిణిలో ఎలాంటి మార్పులు రాకుండా.. స్వల్పకాలికి ఒడిదొడుకులు వచ్చినా.. వాటిని చక్కగా అధిగమించేస్తారు. అయితే అలా కాకుండా కంనెనీలకు కన్నం వేసి.. వాటిని నమ్ముకున్న కస్టమర్లకు సున్నం పెట్టే ప్రబుద్దుల ఆటలు ఎంతోకాలం మనసాగవన్నది కూడా నిజం. అలాంటి తిన్నింటి వాసాలు లెక్కిట్టిన ఘనులు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.
నాలుగు నెలల క్రితం నవీన్ కుమార్ అనే బీకాం చదివిన ఓ ఘనుడు ఆన్లైన్ సంస్థలో డెలివరీ బాయ్ గా చేరాడు. అంతే ఇక తన చేతివాటానికి పనిచెప్పాడు. అన్ లైన్ లో అందమైన మొబైల్ ఫోన్లను ఆర్డర్ చేస్తే వాళ్లకు రాళ్లను ఇచ్చాడు. మరో విలువైన వస్తువును కొనుగోలు చేస్తే వారింటికి మామిడి పండ్లు చక్కగా ప్యాక్ చేసి పంపాడు. అయితే ఇదంతా అన్ లైన్ కంపెనీ చేస్తున్న మోసం అనే భావించారు కస్టమర్లు. కానీ ఇదంతా డెలివరీ ఏజెంట్ల చేతివాటమని తెలుసుకుని అవ్వాక్కయ్యారు.
ఫ్లిప్కార్ట్ సంస్థలో డెలివరీ ఏజెంట్ గా చేరిన నవీన్ ఐఫోన్ల దగ్గర్నించి అనేక రకాల ఫోన్లను మాయం చేశాడు. వాటి స్థానంలో డమ్మీ చైనా ఫోన్లను పెట్టి సంస్థను, కస్టమర్లను మోసం చేస్తున్నాడు. అయితే ఆఫోన్లను అందుకున్న కస్టమర్లు ఫోన్లు బాగోలేదని వాటిని రిటర్న్ చేస్తున్నారని తిరిగి వాటిని సంస్థకు పంపించేవాడు. ఇలా పలుమార్లు ఒకే ప్రాంతం నుంచి వస్తువులు రిటర్న్ వస్తుండటంతో అనుమానం వచ్చిన యాజమాన్యం విచారణ చేసింది. డెలివరీ ఏజెంట్ను పోలీసులకు అప్పచెప్పింది.
చెన్నైలోని వాషర్మెన్ పేట ప్రాంతానికి డెలివరీ ఏజెంట్గా పని చేస్తాడు 21 ఏళ్ల నవీన్. ఇతనే తెలివిగా ప్లాన్ చేసి ఫ్లిప్కార్ట్ను మోసం చేసింది. డెలివరీ చేసే బాయ్స్తో కూడా అబద్దాలు చెప్పించేవాడు. అయితే ఇతను ఇలా చేయడం ఇదే మొదటిసారి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఫ్రెండ్స్ వద్ద చేసిన అప్పులను తీర్చేందుకే అలా చేసినట్టు విచారణలో పేర్కొన్నాడు. అయితే ఒక లాయర్ ఇచ్చిన సలహా ప్రకారమే తాను ఈ ప్లాన్ను అమలు చేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఇతని వద్ద నుండి దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 5లక్షలకు పైబడి ఉంటుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more