ముక్కోటి దేవతలకు కొలువైన రూపంగా హిందువులు గోవును భావిస్తుంటారు. పరమ పవిత్రంగా పూజించే గోవులతో తమ మనోభావాలకు విరుద్దంగా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఇప్పటికే అనేక సందర్భాలలో చెప్పారు. అయినా పలువురు అక్రమంగా గో మాంసాన్ని రవాణా చేయడం, విక్రయించడం చేస్తూ అడ్డంగా దోరుకిపోతున్నారు. ఇలా గో మాంసాన్ని అక్రమంగా తీసుకు వెళుతున్న ఇద్దరు యువకులను నిర్బంధించిన గో రక్షా దళ్ కార్యకర్తలు వారితో ఆవు పేడను తినిపించారు. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
రిజ్వాన్, ముక్తిహర్ అనే ఇద్దరూ ఓ లారీ నిండా ఆవు మాంసాన్ని తరలిస్తుండగా, ఫరీదాబాద్ - ఢిల్లీ బార్డర్ లో గో రక్షా దళ్ అడ్డగించింది. ఆపై వీరికి దేహశుద్ధి చేసి, పేడను తినిపించి 'గో మాతా జిందాబాద్' జై శ్రీరామ్ అంటూ నినదించే చేశారు. గోవు పేడను తినలేక వాంతులు చేసుకున్నా వారిని గో రక్ష దళ్ సభ్యులు విడిచిపెట్టలేదు. త్వరగా తింటేనే వదులుతామని చెప్పారు. కాగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల నుంచి 3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా పోలీస్ అధికారి తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు. ఇదే అసలు చర్చకు దారితీస్తుంది. ఇంటర్ నెట్ సహా సోషల్ నెట్ వర్కులలో వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షిస్తున్నా.. అలాంటి సాక్ష్యాలు ఏమీ లేవని పోలీసులు బాహటంగా చెప్పడాన్ని నెట్ జనులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అక్రమంగా గో మాంసాన్ని సరఫరా చేయడం తప్పే అయితే వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.. అంతేకానీ వారిపై దాడి చేసి.. అవు పేడను తినిపించేందుకు గో రక్షా దళ్ సభ్యులు ఎవరన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గాయపర్చిన వాళ్లను పోలీసులు రక్షించేందుకు యత్నించడం సబబు కాదని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, ఈ ఘటన తరువాత గో రక్షా దళ్ చీఫ్ ధర్మేంధ్ర యాదవ్ స్పందిస్తూ, తమ కార్యకర్తలు మంచి పని చేశారని, ఆవు పేడ పవిత్రమైనదని, దాన్ని తినడం ద్వారా వారు పాపాలను పోగొట్టుకున్నారని చెప్పారు. తమ వారు చేసిన దానిలో తప్పేమీ లేదని అన్నారు. గోవుల విషయంలో నిర్దయగా ప్రవర్తించే వారికి ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more