కాపు కులస్థులపై అక్రమంగా కేసులు బనాయించి రౌడీలు, గుండాలుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ.. కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఇవాళ్టితో నాలుగో రోజుకు చేరుకుంది. రాజమండ్రి అస్పత్రిలో ఆయన తన సతీమణి పద్మావతితో పాటు అమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ముద్రగడ అరోగ్యం స్వల్పంగా క్షీణించడంతో ఆయనకు బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుక ప్రయత్నించినా.. దానిని ఆయన తిప్పికోట్టారు.
దీక్ష విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా ముద్రగడ సతీమణి పద్మావతితో పాటు అయన కోడలి ఆరోగ్యం కూడా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం దిగవచ్చి అయన పాత డిమాండ్లను నేరవేర్చందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని, కొత్తగా ప్రకటించిన డిమాండ్లను తాము పరిష్కరించలేమని చేతులెత్తేసింది. అయితే తునిలో నిర్వహించిన కాపు గర్జన సందర్భంగా జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహణ కేసులో నిందితులను తప్పక అరెస్టు చేస్తామని చెప్పారు.
రైలు దహనం కేసును సిబిఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని, కానీ ముద్రగడ అందుకు సమ్మతించలేదన్న ప్రభుత్వ ప్రచారాన్ని కాపు నేతలు వ్యతిరేకించారు. రెండేళ్లకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాత రత్నాచల్ దహణం కేసును సిబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అయన నాలుగు రోజులుగా దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం తమ కులస్థుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తుందని కాపు నేతలు విమర్శించారు. ముందుగా ముద్రగడ పద్మనాభం పెట్టిన అన్ని డిమాండ్లు నెరవేర్చే దాకా, తమ కులస్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరంచుకునేదాకా ముద్రగడ దీక్ష విరమించరని కాపుల నేతలు తేల్చి చెబుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more