mudragada pabmanabham wife and daughter in laww condition critical

Mudragada pabmanabham hunger strike reaches fourth day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR

Kapu caste leader Mudragada padmanbham continues hunger strike on fourth day in hospital at rajamundry, his wife and daughter in law health condition critical.

నాలుగో రోజుకు చేరిన ముద్రగడ దీక్ష.. క్షీణించిన కుటుంబసభ్యుల అరోగ్యం..

Posted: 06/12/2016 07:14 AM IST
Mudragada pabmanabham hunger strike reaches fourth day

కాపు కులస్థులపై అక్రమంగా కేసులు బనాయించి రౌడీలు, గుండాలుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ.. కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను ఇవాళ్టితో నాలుగో రోజుకు చేరుకుంది. రాజమండ్రి అస్పత్రిలో ఆయన తన సతీమణి పద్మావతితో పాటు అమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ముద్రగడ అరోగ్యం స్వల్పంగా క్షీణించడంతో ఆయనకు బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుక ప్రయత్నించినా.. దానిని ఆయన తిప్పికోట్టారు.

దీక్ష విరమించి వైద్యం పొందడానికి సహకరించాలని పలు దఫాలుగా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా ముద్రగడ సతీమణి పద్మావతితో పాటు అయన కోడలి ఆరోగ్యం కూడా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం దిగవచ్చి అయన పాత డిమాండ్లను నేరవేర్చందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని, కొత్తగా ప్రకటించిన డిమాండ్లను తాము పరిష్కరించలేమని చేతులెత్తేసింది. అయితే తునిలో నిర్వహించిన కాపు గర్జన సందర్భంగా జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహణ కేసులో నిందితులను తప్పక అరెస్టు చేస్తామని చెప్పారు.

రైలు దహనం కేసును సిబిఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని, కానీ ముద్రగడ అందుకు సమ్మతించలేదన్న ప్రభుత్వ ప్రచారాన్ని కాపు నేతలు వ్యతిరేకించారు. రెండేళ్లకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాత రత్నాచల్ దహణం కేసును సిబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అయన నాలుగు రోజులుగా దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం తమ కులస్థుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తుందని కాపు నేతలు విమర్శించారు. ముందుగా ముద్రగడ పద్మనాభం పెట్టిన అన్ని డిమాండ్లు నెరవేర్చే దాకా, తమ కులస్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరంచుకునేదాకా ముద్రగడ దీక్ష విరమించరని కాపుల నేతలు తేల్చి చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  hunger strike  hospital  

Other Articles