మథుర అల్లర్ల విషయంలో తనను మీడియా, సోషల్ మీడియా కావాలని టార్గెట్ చేస్తున్నాయని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. తానేదో నేరం చేసినట్లుగా మీడియా చిత్రీకరించడం, ఏ పాపం తెలియని తనను సోషల్ మీడియా ఏకిపారేయడంపై అమె అగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను అనవసరంగా రాద్ధాంతం చేయడమే పనిగా మీడియా పెట్టుకుందని అమె మండిపడ్డారు. మీడియాతో సహా ప్రతి ఒక్కరూ ఎలాంటి నిజనిజాలు తెలుసుకోకుండా తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారని అరోపించారు.
తనను కావాలని టార్గెట్ చేసుకున్నారన్నారు. ఘర్షణలకు సంబంధించిన సమాచారం అందగానే వెళ్లి అధికారులను కలిశానన్నారు. అలాగే, బాధితులను కూడా పరామర్శించాను. అక్రమంగా కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకున్న క్వార్టర్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని తానే రెండు నెలల కిందట మధుర జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ను కలిసి చెప్పానన్నారు. ఈ విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు విఫలమైనట్లే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టమని ఆమె చెప్పారు.
అసలు ఘర్షణలకు కారమైన అఖలేష్ ప్రభుత్వాని వదిలేని తనపై ఎందుకు అక్కస్సు వెళ్లగక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న హింసను, బాధిత ప్రజల గురించి సమాచారం అందజేయకుండా వాళ్లు(మీడియా-సోషల్ మీడియా) తనను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. మీడియా ఇలాంటి ఘటనల వెనుక నిజనిజాలు కచ్చితంగా తెలుసుకోవాలని, కానీ, అలా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనను టార్గెట్ చేయడం సబబుకాదన్నారు. తాను మథుర, బృందావనంకోసం ఎంతో పనిచేస్తున్నానని, అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పారు.
అయితే మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఒక ఎస్పీ స్థాయి అధికారి సహా ఇద్దరు పోలీసులతో పాటు 21 మంది మరణించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒక సినిమా షూటింగులో పాల్గొంటున్న మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ఒక లాంచీ ఎక్కుతున్న ఫొటోలు మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దాంతో వెంటనే ట్విట్టర్ విమర్శలతో మోతెక్కిపోయింది. మథుర కాలిపోతుంటే ఎంపీ మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. బహుశా అందుకనే కాబోలు అమెను మీడియా, సోషల్ మీడియా టార్గెట్ చేసింది.
మనోహర్
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more