ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతుంటే... సాటి తెలుగు రాష్ట్రంలో మాత్రం నిరసనల పర్వం కొనసాగుతుంది. జూన్ 2 తెలుగు జాతి చరిత్రలో ఓ చీకటి దినమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తూ విజయవాడలో నవనిర్మాణ దీక్షను ఆయన ప్రారంభించారు. ముందుగా ప్రజలతో ప్రతిజ్ణ చేయించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన విభజనను ఆపలేకపోయాం. రహస్యంగా రాష్ట్రాన్ని విభజించారు. బలవంతంగా పార్లమెంట్ తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశారు. సమస్యలు చెబుతుంటే అస్సలు పట్టించుకోలేదు. కట్టుబట్టలతో, నెత్తిన అప్పుతో పొరుగు రాష్ట్రం నుంచి వెల్లగొట్టారు. ఆదాయం లేదు. పార్లమెంట్ లో ఎంపీలు రెండేళ్లు గళం విప్పుతున్నా ప్రయోజనం లేకపోతుంది. కష్టపడి అభివృద్ధి చేస్తే అప్పులే మిగిలాయి. కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి అప్పుడే యూపీఏ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష బీజేపీని హెచ్చరించాను. కానీ, అవేవీ వారు పట్టించుకోలేదు. ఫలితం నేడు ఎలాంటి ఆధారంలేని ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయినా చెక్కుచెదరాల్సిన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది తీరుతుందని ఆయన చెప్పారు. అన్యాయాలు జరిగాయి, అవమానాలు జరిగాయి అవన్నీ భరించాం. రాష్ట్రాన్ని విడగొట్టిన వారికి అసూయ, ఈర్ష్య కలిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి చూపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని, రాష్ట్రపురోగతికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందంటూ ప్రసంగించారు.
అంతకు ముందు రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకత్వం మనకు దొరికింది, మంచి ప్రభుత్వం మనకు దొరికింది’ అని అన్నారు. ‘అన్యాయాన్ని నెమరు వేసుకుందాం, అవకాశాలను ఆలోచిద్దాం’ అంటూ చెప్పారు. ‘ఒక సంకల్పాన్ని తీసుకుందాం, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం పట్టించుకోకపోయినా బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని సమస్యలను అధిగమిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more