కేరళకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన వీడియో ఒకటి ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రముఖంగా మారింది. తమది పేద కుటుంబమనో, ఆర్థిక సాయం చేయాలనో ఆమె అందులో కోరలేదు. రెండేళ్ల పాలనలో ఎలాంటి తప్పులు దొర్లలేదంటూ ఘనంగా చెప్పుకుంటున్న సమయంలో ఈ బాలిక అడిగిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. గతంలో ఎంతో మంది తమ సమస్యలను విన్నవిస్తూ ప్రదానికి లేఖలు రాయగా, ఈ బాలిక మాత్రం తన గోడును వెల్లబోస్తూనే అనేక ప్రశ్నలు గుప్పించింది. 15 ఏళ్ల అన్నె రుజు జోషి అనే బాలిక మోదీని ఉద్దేశించి తయారు చేసిన ఆ వీడియో పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు ఈ అమ్మాయి దేశంలో విస్తరించి ఉన్న డ్రగ్ మాఫియా అంశాన్ని లేవనెత్తింది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. అందులో ఈ మత్తుపదార్థాల దందా కూడా చాలా ముఖ్యమైనదే. యువత తొందరగా దీనికి ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దానిని అంతం చేయకపోతే, దేశం ఎలా బాగుపడుతుంది అంటూ వీడియోలో ప్రశ్నించింది. మొత్తం 6 నిమిషాల నిడివి గల వీడియోను వారం క్రితం అప్ లోడ్ చేయడమే కాదు ప్రధాని కార్యాలయం పీఎంవోకి మెయిల్ చేసింది. మత్తు పదార్థాల దుష్ర్పభావాలపై ఆంటూ ఆమె ఆంగ్లంలో మాట్లాడిన వీడియో క్రమంగా వ్యాపించింది. ముఖ్యంగా తీవ్రవాదం కన్నా మత్తుమందులు చాలా ప్రమాదకరమని, వాటిని నివారించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని, ప్రధాని స్పందించాలని కోరుకుంటున్నానని చివర్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆనీ మరో విషాదకరమైన విషయాన్ని వెల్లడించింది. తన తండ్రి లివర్ క్యాన్సర్ కారణంగా మరణించాడని తెలిపింది. అందుకే తనలాంటి పరిస్థితి మరెవరికి రావొద్దని కొరుకుంటూ తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్-ఫార్ట్యూన్ స్థాపించి, దాని ద్వారా తాను పోరాటం చేస్తున్నానని వివరించింది. గతంలో తన దాకా వచ్చిన ఏ సమస్యను మోదీ వదల్లేదు. మరి ఈ బాలిక పంపిన వీడియోపై ఎలా స్పందిస్తారో చూడాలి.
భాస్కర్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more