క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జునలు మరి కొందరు సినీ ప్రముఖులు బుధవారం ఉదయం తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. మాస్టర్ తో వీరు దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే కేవలం స్వామి దర్శనార్థం వీరు యాదృచ్ఛికంగా కలుసుకుని ఉంటారనుకున్న వారికి వీరు పెద్ద షాకే ఇచ్చారు. వీరి కలయిక వెనుక అసలు కారణం ఇప్పుడు తెలిసింది. కేరళ బ్లాస్టర్ పుట్ బాల్ టీం కు సచిన్ సహా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఆయనకు 40 శాతం వాటా ఉంది. ప్రముఖ నిర్మాత పీవీపీ ఇందులో మరో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవలె ఆయన ప్రాంచైజీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ వాటాలను చిరు, నాగ్ లు కొనుగోలు చేశారంట. వీరితోపాటు ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ సత్యనారాయణ కూడా సహా భాగస్వాములుగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. ఈ మేర చిరు, నాగ్, అల్లు అరవింద్, నిమ్మగడ్డ సత్యనారాయణలతో దిగిన సెల్ఫీని సచిన్ షేర్ చేశాడు. అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించాడు. కాగా, తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వీరు అటునుంచి అటే చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో భేటీ అయ్యారు. కేరళలో వీరు ఓ ఫుట్ బాల్ అకాడమీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోస పూర్తిస్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అక్టోబర్ నుంచి మొదలు కానుంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more