నెట్ జనుల వేలం వెర్రి కాకపోతే.. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా.. వారి గురించి తెగ వెతికేసి.. సోషల్ మీడియాలో వారిని ట్రెడింగ్ వ్యక్తులుగా మార్చేస్తుంటారు. సరిగ్గా అలానే జరిగింది రాకేష్ రంజన్ యాదవ్ విషయంలోనూ. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ఓ యువకుడిని కాల్చి చంపిన బిహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవీ కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గురించి ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు. అతడి అభిరుచులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు క్యూ కట్టారు. మే 7నుంచి ఇప్పటి వరకు బిహార్లో ఫేస్ బుక్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి రంజన్ యాదవ్ అని.. మంగళవారం సాయంత్రం నాటికి ఫేస్ బుక్ ద్వారా అతడి గురించి 1,44,287సార్లు తెలుసుకునేందుకు క్లిక్ చేశారు.
మే 7న రాత్రి రంజన్ యాదవ్ ఓ స్కూల్ యువకుడిని తన తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లంతా అతడి సమాచారం కోసం వివిధ పేర్లతో వెతకడం మొదలు పెట్టారు. రాకేశ్ రంజన్ యాదవ్ పేరిట 53,748మంది, రాకీ యాదవ్ పేరిట 69,789 మంది, రాకీ యాదవ్ గయా పేరిట 20,750 మంది అతడి గురించి తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ద్వారా వెతికాడు. అయితే, అతడి ప్రొఫైల్ లో అతడి వివరాలేమి కనిపించలేదు. కానీ, కొన్ని ఫొటోల్లో మాత్రం కండల వీరుడిగా కనిపించాడు. ఈ తుపాకులతో పలుసార్లు పోజిచ్చి కనిపించాడు. దీని ప్రకారం అతడికి తుపాకులంటే చాలా ఇష్టమని తెలిసింది.
బీహార్లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి అతిక్రమించడంతో అమె కూడా ప్రస్తుతం అరెస్టు వారెంట్లను అందుకోనున్నారు. మధ్య నిషేదం అములలో వున్నా అమె తన నివాసంలో బాటిళ్ల కోద్ది మధ్యం సీసాలను అట్టిపెట్టుకున్నారన్న అరోపణలపై అమెను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మనోరమా దేవి యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు, ఆయనను రెండు రోజుల పోలీసుల కస్టడీకీ స్థానిక న్యాయస్థానం అదేశించడంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more