మొత్తం 17 బ్యాంకులకు మస్కా కొట్టించి 9 వేల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టేసి.. ఆర్థిక నేరానికి పాల్పడిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... రుణాన్ని ఎగవేసి లండన్ పారిపోయినట్లుగానే మరో బడా బిజినెస్ మెన్ కూడా ఆయన బాటలోనే నడిచేందుకు ఉపక్రమించినా.. చివరకు తమ జోక్యంతో చిక్కారని ఓ ప్రముఖ న్యాయవాది ఇటీవల ఓ సదస్సులో తన అంతరంగంలోని మాటలను వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఒక వేళ విజయ్ మాల్యా తరహాలోనే ఈ బడా బిజినెస్ మెన్ కూడా దేశం విడిచి పారిపోయివుంటే ఆయన సంస్థలో డబ్బులు పెట్టిన అనేక మంది రోడ్డున పడేవారని అయన అన్నారు.
బడా బిజినెస్ మెన్ కూడా మల్యా తరహాలోనే విదేశాలకు వెళ్లివుంటే.. దేశానికి తిరిగి వచ్చేవారు కాదని, మాల్యా తరహాలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి దర్యాప్తు సంస్థలనే కాక, కోర్టుల నోటీసులను కూడా పెద్దగా పట్టించుకోకపోయేవారని స్పష్టం చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు మరో బడా బిజినెస్ మ్యాన్ పక్కా ప్లాన్ వేసుకున్నారట. ఇంతకీ ఆ బిజినెస్ మెన్ ఎవరంటే, దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్లను మాయ మాటలతో నమ్మించేసి 24 వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్.
2014 మార్చి 4 నుంచి తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న రాయ్... తన అరెస్ట్ కు ముందు దేశం విడిచి పారిపోయేందుకు యత్నించారట. సుబ్రతో రాయ్ కేసులో సెబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అరవింద్ దాతర్ ఈ సంచలన విషయాన్ని నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లతో వ్యాపార చర్చల పేరిట రాయ్ చల్లగా జారుకునేందుకు పక్కాగానే ప్లాన్ చేసుకున్నారని దాతర్ ఆరోపించారు.
అయితే, అప్పటికే సహారా గ్రూపు సేకరించిన డిపాజిట్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడానికి కాస్తంత ముందుగా ఆయన ఈ యత్నం చేశారట. అయితే రాయ్ ప్లాన్ వర్కవుట్ కాకముందే సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేయడం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలు ఏ మాత్రం లేటైనా... సుబ్రతో రాయ్ కూడా డిపాజిటర్లను నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసేవారేనని అన్నారు
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more