Three accident victims die, bystanders watched them beg for help in karnataka

Mysuru accident victims plead for help die without assistance

accident, HDKote, Bengaluru,Karnataka, India, Jogahalli, bystanders, beg, help, dead, selfies, videos, humanity, inhuman, bike met accident with bus, three persons died beg for help, viral video, Accident Victims Plead For Help, Accident Victims Die Without Assistance, Road accident, Humanity

Three persons, who met with a road accident, died with nobody coming to their assistance, despite cries for help while lying in a pool of blood near Kolagala gate in the Mysuru district

సాయం కో్సం అర్జించి.. అర్థించి అసువులు బాసారు..

Posted: 03/26/2016 06:54 AM IST
Mysuru accident victims plead for help die without assistance

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చకైనా లేడు చూడు.. మానవత్వం వున్నవాడు అంటూ ఓ తెలంగాణ కవి రాసిన కవిత అక్షరాల నిజమైంది. సాంకేతిక విప్లవం అందుబాటులోకి రాగానే ఏం జరిగినా పెల్సీలు, వీడియో రికార్డులకు మాత్రమే యువత, పెద్ద, ముసలి ముతక అందరూ అదే దారిలో ప్రయాణిస్తున్నారు. సాంకేతిక విప్లవాన్ని పునికిపుచ్చుకుని తమ ఫలానా చోట ఫలాన ప్రమాదం జరిగింది.. వారికి సాయం చేయాలంటూ స్పందించే మనుషులు కరువయ్యారు.

తమ కళ్ల ఎదుటే ముగ్గురు వ్యక్తులు రక్తమోడుతూ చావుబతుకుల మధ్య కోట్టుమిట్టాడుతున్న పట్టించుకోని ఈ మనుషుల మద్య మనుషిగా తిరగడానికే మనిషన్నవాడికి సిగ్గుపడుతున్నాడు. అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజంగా నిజం. సాంకేతికత తమ కళ్లకు పోరలను కమ్మెస్తూ తమ కళ్ల ఎదుట మనుషులు జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్నా.. క్షతగాత్రులు సాయం చేయండమ్మ, సాయం చేయండి బాబు అంటూ ఆర్థించి, వేడుకున్నా వారిలో కనీసం కనికరం లేకుండా పోతే వారినేం అనాలి. మనుషులనేనా..?

రోడ్డు ప్రమాదంలో గాయపడి ‘సాయంచేయండి బాబూ’ అని అర్థిస్తున్నా.. అక్కడున్న వారు ముందుకురాలేదు. పైగా ఫొటోలతో కాలక్షేపం చేశారు. దీంతో క్షతగాత్రులలో ఇద్దరు అక్కడే మరణించారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని జోగనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్, మహేష్, రమేష్‌లు కొళగాళకి బైక్‌పై వెళ్తుండగా మైసూరు-హెచ్.డి.కోట రహదారిలో బైక్‌ను కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. ముగ్గురి పై నుంచి బస్సు వెళ్లడంతో మంజునాథ్ ప్రాణాలు కోల్పోగా, రమేష్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సాయం  చేయండని వీరిద్దరూ స్థానికులను ప్రాధేయపడినా వారు ముందుకు రాలేదు. అయితే వారు కూడా ప్రాణాలను కోల్పోయారు. జనారణ్యంలో మృగాల మధ్య ఈ ఘటన జరిగినా అవి తమ వారి ప్రాణాలను తోడేసుకున్నాయని మృతుల బంధువులు అవేదన వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : accident  HDKote  Bengaluru  Karnataka  India  Jogahalli  bystanders  Road accident  Humanity  

Other Articles