శివరాత్రి పర్వదినాన.. ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తారని భావించిన ఉగ్రవాదులు అక్కడ అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవచ్చన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో గత వారం రోజులుగా దేశంలో హై అలర్ట్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా పోలీసులు, సాయుధ బలగాలు నిఘాను ఏర్పాటు చేస్తూనే వున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
దీంతో ఉలిక్కిపడిన భద్రతాదళాలు ముందుజాగ్రత్త చర్యగా ప్రజలకు విమానాశ్రయం లోనికి ఎవర్నీ అనుమతించడం లేదు. బెదిరింపు ఈ-మెయిల్ కారణంగా మూడు రోజుల పాటు విమానాశ్రయంలోకి ప్రజలకు ప్రవేశం నిలిపివేశారు. తమ డిమాండ్లకు అంగీకరించని పక్షంలో ఎయిర్ పోర్టును పేల్చివేస్తామని అగంతకులు ఈ మెయిల్ లో హెచ్చరించినట్లు వార్తలు అందుతున్నాయి. కాగా కోల్కతాలోని నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చిందని భద్రతా దళాలు పేర్కోన్నాయి.
కాగా విమానాశ్రయ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. విమానాశ్రయ మేనేజర్ మెయిల్కు ఈ బెదిరింపు మెయిల్ వచ్చిందని, అది జర్మనీ నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. అగంతకులు ఈ-మెయిల్లో రూ.16లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. సైబర్ క్రైం బృందం ఈ-మెయిల్లో సమాచారం నిజానిజాలపై పరిశీలిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more