ఫోన్ చేసి విసిగిస్తాడు.. పదేపదే తన గదికి రమ్మంటాడు.. నీ పదోన్నతి కోసం సీఆర్పై సంతకం చేశా కదా.. మనసారా ముద్దివ్వవా?... అంటూ వేధిస్తున్నాడు... భర్త లేని నీవు నాతో గడిపితే.. ఉద్యోగమే అవసరం లేదు.. ఒప్పుకోనందుకు కార్యాలయానికి వచ్చినా సెలవేనంటూ హెచ్చరిస్తున్నాడు.. నేనిక ఉద్యోగం చేయలేను.. ఆత్మహత్యే శరణ్యం’... అంటూ ఓ వ్యవసాయాధికారిణి కలెక్టర్ ఎం. జానకికి ఫిర్యాదు చేశారు. భూసార పరీక్షల కేంద్రం ఏడీఏ తనను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని లిఖిత పూర్వకంగా తెలిపారు. దీంతో ఆ అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
నెల్లూరు తాలూకా కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భూసార పరీక్షల కేంద్రంలో వ్యవసాయాధికారణిగా పని చేస్తున్న మహిళ ఇప్పటి వరకు అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు ఆ అధికారి పై ఉన్నతాధికారులు హెచ్చరికలతో సరిపెట్టారు. కాగా అతడి వేధింపులు మితిమీరడంతో బాధితురాలు లిఖితపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు ఆరోపణలు మూటకట్టుకున్న సదరు అధికారి ఏడీఏ కేడర్ నుంచి ఏవో డిమోషన్ అయ్యారు. 2015 నవంబరు నుంచి తనను టార్గెట్ చేసిన ఏడీఏ ప్రతిరోజూ వేధిస్తున్నాడంటూ బాధితురా లు వాపోయారు.
ప్రమోషన్ సీఆర్పై సంతకం చేసినందుకు ముద్దివ్వాలని, భర్తలేనందున తనకు లొంగాలని, బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 11, 12 తోటి ఉద్యోగినులు రాకపోయినా, సెలవు ప్రకటించినా ఏడీఏ తనచేత బలవంతంగా సెలవు పె ట్టిం చాడని వివరించారు. ఇప్పటికే అతడి వేధింపులపై జేడీ, ఉద్యోగ సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఇకపై వేధింపులు భరాయించే శక్తి తనకు లేనందున ఆత్మహత్యే శరణ్యమని బాధి తురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more