Police lotty charge on Protesters

Police lotty charge on protesters

Police, AP, Bhimavaram, Thundur, Mega Aqua Food park

In AP state, Bhimavaram Mandal Thundur villages protest on Mega Aqua food Park. Police lotty charge on protesters.

ITEMVIDEOS: ఏపిలో నిరసనకారులపై విరిగిన లాఠీ

Posted: 01/22/2016 01:44 PM IST
Police lotty charge on protesters

ఏపిలోని భీమవరం మండలం తుండూరులో ఉద్రికత్త నెలకొంది. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో.. లాఠీఛార్జ్ వరకు పరిస్థితి దిగజారింది. ఆ గ్రామంలో నెలకొల్పాలనుకున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పనులను అడ్డుకునేందుకు తుండూరు గ్రామస్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ జరిపి ఆందోళనకారులను తరిమికొట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చుట్టుపక్కల ఆక్వా ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో.. తుండూరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆక్వా ఫుడ్ పార్క్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 8 గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫుడ్ పార్క్ నుంచి వచ్చే కాలుష్యం కారణంగా తాగునీరు, పరిసర ప్రాంతాలు కలుషితం అవుతాయని, తాము అనారోగ్యం బారిన పడతామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పటినుంచో ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయినా నిర్వాహకులు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడంతో.. అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. అయితే పోలీసులపై నిరసన కారులు రాళ్లురువ్వడంతొ.. పోలీసులు నిరసనకారులపై లాఠీ ఝులిపించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  AP  Bhimavaram  Thundur  Mega Aqua Food park  

Other Articles