ఆస్ట్రేలియా పర్యటిస్తున్న భారత జట్టుకు అహ్వాన జట్టు నాలుగో వన్డేలో భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. అహ్వాన జట్టుతో జరుగుతున్న వన్డే సీరిస్ లో భాగంగా ఇప్పటికే వరుసగా మూడు అపజయాలను మూటగట్టుకున్న టీమిండియా వన్డే సిరీస్ ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ జరుగుతున్న నాల్గవ వన్డేలో అసీస్ ధోనిసేనకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపనర్లు టీమిండియా బౌలర్లును చితకబాది శుభారంభాన్ని అందించారు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు తమ శక్తినంతా ధారపోసినా.. శతకమున్నర భాగస్వామ్యం తరువాతే అది సాధ్యపడింది. ఇక విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా పేరున్న అసీస్ కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు.
ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ జోడీ 187 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లు 29 ఓవర్లు పాటు శ్రమించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఎట్టకేలకు ఆ మరుసటి ఓవర్లో వార్నర్ ను భారత పేసర్ ఇషాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఫించ్.. మార్ష్ అదే జోరు కొనసాగించారు. సెంచరీ చేసిన తర్వాత ఫించ్.. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ మరింత దూకుడుగా ఆడాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన వెంటనే స్మిత్ అవుటయ్యాడు. కాగా అప్పటికే ఆసీస్ స్కోరు 300 కు చేరువైంది. చివరల్లో మ్యాక్స్ వెల్ విజృంభించాడు. 20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో 41 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా ముందు భారీ టార్గెట్ ఉంచింది. భారత్ బౌలర్లు ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more