అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకే కాదు ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ ను తిప్పికొట్టేందుకు దాదాపు 15 వేల మందితో సైన్యం ఏర్పడింది. త్వరలో భారత్ లో కూడా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ధర్మసేన పేరుతో 15 మంది సైన్యంగా ఏర్పడ్డారు. హిందుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రాణాలర్పించడానికైనా వెనుకాడేది లేదని చెప్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మజియాబాద్ లో ఈ ధర్మసేన ఏర్పాటైంది. హిందుత్వాన్ని కాపాడేందుకు, ఐఎస్ఐఎస్ ను ఎదుర్కునేందుకు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టేందుకు వీరు ఉన్నారని తెలిపారు.
త్వరలోనే భారత్ మీద కూడా తాము యుద్దానికి దిగుతామని ఐఎస్ఐఎస్ హెచ్చరికలు జారీ చెయ్యడం... కాశ్మీర్ లాంటి కీలక ప్రదేశాల్లో వివాదాస్పంగా ఐసిస్ జెండాలు కనిపిస్తుండటం మీద హిందువాదులు అప్రమత్తమవుతున్నారు. భవిష్యత్తులో ఐసిస్ దాడులకు పాల్పడితే వాటిని తిప్పికొట్టేందుకు రెండేళ్లో దాదాపు 15 వేల మంది హిందువులకు శిక్షణనిచ్చారు. ధర్మసేన సేనలో 8-30 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులు, బాలలు చేరుతున్నారు. వీరికి కత్తులు, తుపాకులను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు దాదాపు 50 ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రహస్యంగానూ, మరికొన్నిటిలో బహిరంగంగానూ శిక్షణ ఇస్తున్నారు. మొదటి ఆరు నెలల్లో ధర్మసేన సైనికులకు భగవద్గీత శ్లోకాలు బోధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు ఇస్తామని హిందూ స్వాభిమాన్ నేతలు చెప్తున్నారు. ఇస్లామిక్ ఛాందసవాదం, ఉగ్రవాదం గురించి తెలియజేస్తున్నామని చెప్పారు. తమ వద్ద శిక్షణ పొందే బాలలు నిర్భయంగా ఉంటారని తెలిపారు. ఆరు నెలలు శిక్షణ పొందినవారు కావాలనుకుంటే స్వయంగా తామే శిక్షణ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. రెండేళ్లలో 15 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more