అస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డే సిరీస్ లలో తొలి వన్డే మ్యాచ్ ను గెలిచి జోరుమీదున్న అతిథ్యజట్టుకు భారత్ రెండో వన్డేలోనూ రమారమి తొలి వన్డేలో నిర్ధేశించిన విజయలక్ష్యాన్నే అసీస్ ముందుంచింది. తొలి వన్డేలో 310 పరుగుల టార్గెట్ ను అసీస్ ముందుంచిన ధోని సేన.. రెండో వన్డేలో ఒక్క పరుగు తక్కువగా 309 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఫ్లాట్ వికెట్ అనుకూలతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న టీమిండియా పరుగుల వరద పారించింది. ఆదిలో ఓపెనర్ శిఖర్ ధవన్(6) వికెట్ ను కోల్పోయినా.. ఆ తరువాత రెండు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి 309 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణిస్తే, రోహిత్(124; 127 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్ తో శతకం నమోదు చేశాడు. కాగా, విరాట్-రోహిత్ శర్మల జోడీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడం అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ జోడీ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మంచి పునాది వేయగా, ఆపై రోహిత్-అజింకా రహానే ల జోడి మూడో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.
ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11) క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేదు. రోహిత్ శర్మ ఔటయిన తరువాత భారత్ వికెట్లు ఒక్కోక్కటి వెనువెంటనే పడ్డాయి. రోహిత్ అవుట్ అయిన వెంటనే ధోని, ఆ తరువాత కొద్ది సేపు నిలదోక్కకుని అడిన రహానే(89) సెంచరీ సాధిస్తాడని అనుకున్న నేపథ్యంలో సరిగ్గా 89 పరుగల వద్ద పెవీలియన్ కు చేరాడు. ఆ తరువాత మనీష్ పాండే (6), రవీంద్ర జడేజా (5), అశ్విన్(1) లు స్కోరును పెంచే యత్నంలో వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ కు రెండు వికెట్లు లభించగా, జోయల్ పారిస్, బోలాండ్, హాస్టింగ్స్ లకు తలోవికెట్ దక్కింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more