కేంద్రమంత్రి సురేష్ ప్రభు మరోమారు రైలు ప్రయాణికులను బాదేసారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో భాగంగా చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ముక్కు పిండీ మరీ డబ్బులు వసూలు చేయాలన్ని నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇందులో బాగంగానే రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే బడ్జెట్ ముందు చార్జీలను వాయించిన కేంద్ర మంత్రి.. తాజాగా.. రైల్వే శాఖ తత్కాల్ టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్నయం తీసుకున్నారు. రేపటి నుంచి ఛార్జీల పెంపు అమలులోకి రానుంది.
ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ తత్కాల్ ఛార్జ్ పెంచినట్లు తెలుస్తోంది. స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్ కోసం గతంలో కనీసం రూ.175 ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.200కు పెంచారు. థార్డ్ ఏసీ ఛార్జీని రూ.350 నుంచి రూ.400 వరకు పెంచారు. థార్డ్ ఏసీ కనీస తత్కాల్ ఛార్జీని కూడా రూ.250 నుంచి రూ.300కు పెంచారు. స్లీపర్ క్లాస్లో కనీస ఛార్జ్ గతంలో రూ. 90 ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.100కు పెంచారు. ఎక్కువ శాతం ఏసీ క్లాస్కు మాత్రమే రైల్వే శాఖ ఛార్జీలు పెంచింది. సెకండ్ క్లాస్ తత్కాల్ ఛార్జీల్లో పెద్దగా మార్పులు చేయలేదు. సెకండ్ ఏసీ ప్రయాణికులకు ఇప్పుడు తత్కాల్ టికెట్ను కనీసం రూ.400కు పెంచారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more