మొన్నటిదాకా నేషనల్ హెరాల్డ్ పై నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు నేడు అరుణ్ జైట్లీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ తో హోరెత్తింది. ఢిల్లీడిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి వ్యవహారం లో అరుణ్ జైట్లీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. రాజ్యసభలోనూ ఈ అంశంపై అల్లరి జరగడంతో వాయిదా పడింది. అరుణ్ జైట్లీ 13 ఏళ్లపాటు.. అంటే 2013 వరకూ డిడిసీఏ చైర్మన్ గా ఉన్నారు. ఈ సంఘంలో అవినీతి పై జైట్లీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరుతోంది.
డిడిసిఎ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడినట్లు వస్తున్న వార్తల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన, తన కుటుంబ సభ్యుల మీద ఆప్ పార్టీ చేస్తున్న ఆరోపణల మీద ాయన పాటియాలా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా రూ.35 కోట్లు సేకరించామని, మైదానం నిర్మాణానికి బీసీసీఐ 4 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో 114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియం పునర్నిర్మాణం చేపట్టామని వివరించారు. అయితే కాంగ్రెస్ పాలనలోనే అధికంగా నిధులు ఖర్చయ్యాయన్న జైట్లీ, స్టేడియం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ మీద పది కోట్ల రూపాయల దావా వేశారు అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంట్ లో కూడా చర్చిస్తామని కేంద్ర మంత్రి నర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర మంత్రులు జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు అరుణ్ జైట్లీ వెంట కోర్టుకు వచ్చారు. కాగా దీనిపై వచ్చే నెల 5న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more