ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి కలసి భోజనం చేశారు. అయుత మహా చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం విజయవాడకు వెళ్లిన సందర్భంగా అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు నివాసంలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోసం నోరూరించే 15 రకాల వంటకాలతో కూడిన మెనూను చంద్రబాబు సిద్ధం చేయించారు.
తన ఇంటికి సమీపంలోని హెలిపాడ్ లో దిగిన కేసీఆర్ కు ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరాపు అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ బాబు, కామినేని శ్రీనివాస్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత చంద్రబాబు నివాసంలోకి వెళ్లగానే ఆయన కూడా బయటికి వచ్చి కేసీఆర్ ను అహ్వానించారు. చండీయాగానికి కుటుంబసమేతంగా హాజురుకావాలని కోరుతూ ఆయన ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు.
ఆ తరువాత కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు అచ్చమైన 16 అణాల షడ్రుచుల బొజనాన్ని వడ్డించారు. కేసీఆర్ కు అచ్చ తెలుగింటి రుచులతో బోజనం వడ్డించారు. గోంగూర, ఉలవచారు, నాటుకోడి పులుసు, టమోటా పప్పు, మజ్జిగ పులుసు, మునక్కాయ సాంబారు, బిరియానీ, గడ్డ పెరుగులతో పాటు పూతరేకులు, కాజాలు వంటి స్వీట్స్, వివిధ రకాల పండ్లతో బోజనం చేసిన ఇద్దరు సీఎంలు పలు అంశాలపై చర్చించారు. కాగా కేసీఆర్ తో పాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్లు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more