తెలుగు ప్రేక్షకులకు హీరో నానితో కలసి నటించిన హీరోయిన్ గుర్తుందా..? ఏ సినిమాలో అనే మీ ప్రశకు అవకాశం లేకుండా పూర్తి డీటైల్స్ అందిస్తున్నాం. హీరో నాని సరసన 'జెండాపై కపిరాజు' చిత్రంలో నటించిన రాగిణి ద్వివేదీ గుర్తందా..? చాలా మటుటకు గుర్తు పట్టేలేక పోతున్నారు. అవునవును. బాక్సీఫీసు వద్ద బోర్లా పడిన చిత్రాలను, ఆ చిత్ర నటీనటులను ఎవరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అదీ కాక సినిమా అంతగా బాగోలేదన్న బొలడెంత మౌత్ పబ్లిసిటీ వచ్చిన ఈ చిత్రాన్ని ఎవరు మాత్రం చూసేందుకు సాహసిస్తారు. అందుకనే చాలా మందికి రాగిని గురించి తెలియదు.
అయితే ఈ అమ్మడు మాత్రం సాండిల్ వుడ్ లో ఒక రేంజ్ లో వెలిగిపోతోంది. దీనికి తోడు అసలు భయం బెనుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడటంతో అమెకు అవకాశాలు అలానే వస్తున్నాయి. కాగా నోటి దురుసని కొందరు అమెపై వెనుక విమర్శలు చేసినా.. అమె పెద్దగా పట్టించుకోదు. అలాంటిది అమెపై ఓ వ్యక్తి నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా రాగిని ద్వివేది సహ అమె సోదరుడిపై బెంగళూరు పరిధిలోని జేపీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 'నాటికోలి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకటేష్ అనే నిర్మాత ఈ ఫిర్యాదు చేశారు. తన చిత్రంలో యాక్ట్ చేసేందుకు రాగిణితో ఒప్పందం కుదుర్చుకుని, ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ. 17 లక్షల వరకూ చెల్లించానని, కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం ఆగిపోగా, ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని ఆ నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఎన్నోమార్లు డబ్బు కోసం ఆడుగగా, మరో సినిమాలో నటిస్తానే తప్ప డబ్బిచ్చేది లేదని ఆమె చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేష్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more