కేంద్రం చేపడుతున్న గ్యాస్ నగదు బదిలీ పథకం గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. ప్రపంచంలో అతి విస్తార నగదు బదిలీ కార్యక్రమంగా.. గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు కితాబునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన యోగ్యతాపత్రాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చమురుశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ అందించారు. రాయితీ మినహాయించి గ్యాస్ ధర వసూలుచేసే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. రాయితీని నేరుగా వినియోగదారు బ్యాంకు ఖాతాలో వేసి, బుకింగ్ సమయంలో గ్యాస్ మార్కెట్ ధరను వసూలు చేస్తోంది. ఈ బృహత కార్యక్రమానికే గిన్నిస్ ప్రశంసలు లభించాయి. ఈ పథకం, యూపీఏ-2 హయాంలోనే రూపుదాల్చింది. ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆన్ ఎల్పీజీ’ (డీబీటీఎల్)గా 2013 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. పథకం అమల్లో ఎదురవుతున్న చిక్కులను తొలగించి పెద్దఎత్తున సంస్కరించింది.
‘పహల్’ (ప్రత్యక్ష హస్తాంతరిత లాభ్) పేరిట దేశంలోని 54 జిల్లాల్లో గత ఏడాది నవంబరు 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది జనవరి 1 నుంచి దేశమంతటా విస్తరించింది. ‘‘ఎల్పీజీ సేవలను 18.19 కోట్ల మంది పొందుతుండగా, గత ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఆ సంఖ్య 14.85 కోట్లుగా తేలింది. మిగిలిన మూడు కోట్లకు పైగా నకిలీ, దొంగ గ్యాస్ పుస్తకాలు కలిగి ఉన్నట్టు ‘పహల్’లో భాగంగా గుర్తించి తొలగించేశాం. వీరిలో గత జూన్ 30వ తేదీ నాటికి 12.57 కోట్ల కుటుంబాల పరిధిలో ‘పహల్’ అమలు కాగా, ఈ నెల మూడో తేదీ నాటికి ఆ సంఖ్య 14.62 కోట్లకు పెరిగినట్టు గిన్నిస్ రికార్డ్సు నిర్ధారించింది’’ అని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సరైన పత్రాలు సమర్పించడం, దొంగ ధ్రువీకరణలను అందించడం ద్వారా లబ్ధి పొందుతున్న 3.45 కోట్ల మందిని గుర్తించి తొలగించడంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో (ఒక వినియోగదారుకి ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున) రూ. 14,672 కోట్లకుపైగా ఖజానా ఆదా అయినట్టు శాఖ వర్గాలు తెలిపాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more