తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి జనజీవన స్రవంతి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అయితే నిండా మునిగిన చెన్నై కి అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. తమను ఆదరించిన చెన్నైకి తమ సహాయాన్ని అందిస్తున్నారు. కొంత మంది నేరుగా డబ్బులు సహాయం చేస్తే మరి కొందరు ఆహార పొట్లాల రూపంలో సహాయం చేస్తున్నారు. మొత్తంగా తెలుగు తారా లోకం చెన్నైకి అండగా నిలుస్తోంది. చెన్నైకి సహాయం చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి....
భారీ వర్షాలు, వరదల వల్ల కష్టాలు పడుతున్న చెన్నై వాసులకు సాయం చేయడానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'నా జీవిత తొలి రోజుల్లో 18 ఏళ్లు చెన్నైలో గడిపాను. ఆ నగరం నన్ను హీరోను చేసింది. ఐ లవ్ యూ చెన్నై' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం చెన్నై నగరంలో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు, మెగా హీరో వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లుగా అయన తెలిపారు. "చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయంగా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను", అని అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో ప్రస్తుతం చెన్నై మహానగరంలో ప్రత్యక్షంగా కనపడుతోంది. జనజీవనం స్తంభించిపోయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న చెన్నై నగర వాసులకు అండగా నిలవటం అవసరం. చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు.
" చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం", అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.
చెన్నై నగరం వరదల తాకిడికి గురై జనజీవనం అస్తవ్యస్తమైన నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. చెన్నై వరద బాధితులకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తమిళనాడు సి.ఎం రిలీఫ్ ఫండ్ కి ఈ విరాళాన్ని అందజేస్తారు.
మరో తెలుగు నటుడు సందీప్ కిషన్ ఐదువేల ఆహారపు పొట్లాలను చెన్నై వరద బాధితులకు పంపినట్టు తెలిపారు. చెన్నైలోని తన ఇంటి నుంచి వీటిని సమకూర్చినట్టు ట్విట్టర్లో తెలిపారు. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
ఇటీవల కాలంలో తమిళనాడు మొత్తం విస్తృతమైన వర్షాల కారణంగా రాష్ట్రమంతా ప్రజల తీవ్రమైన ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్మహరాజ్ రవితేజ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి సి.యమ్ రిలీఫ్ ఫండ్కి అందించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more