డిస్కౌంట్ ఆఫర్ వుందంటే అవసరం లేకున్నా ఆ వస్తువును కోనుగోలు చేసే నైజం భారతీయులకు అమితంగా వుందని గ్రహించిన అనేక ఈ కామర్స్ సై్లు ఏడాదిలో రెండు నుంచి మూడు పర్యాయాలు ఢిస్కౌంట్ సేల్ ను ప్రవేశపెడుతూ సోమ్ముచేసుకుంటున్నాయి. అయితే సుమారుగా 90 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్న యాప్ గురించి తెలిస్తే.. ఇక భారతీయులు ఊరుకుంటారా. అసలే రమారమి పట్టణవాసులందరి చేతుల్లోనూ స్మార్ ఫోన్ దర్శనమిస్తున్న తరుణంలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకుండా ఎలా వుంటారు. అయితే ఈ యాప్ దేనిపై డిస్కౌంట్ ఇస్తుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఇది నిత్యం మనకు అవసరం వచ్చే అప్ కాబట్టి.
వివరాల్లోకి వెళ్తే..తక్కువ ఖర్చుతో ఫోన్ కాల్స్ మాట్లాడే సదుపాయం కల్పిస్తున్న రింగో అప్లికేషన్ తాజాగా 19 పైసలకే నిమిషం పాటు దేశీయంగా కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాల్స్పై తాము వసూలు చేస్తున్న రేటు టెలికాం కంపెనీలు వసూలు చేస్తున్న చార్జీల కన్నా 90 శాతం తక్కువని ఈ సంస్థ చెబుతోంది. మొబైల్ ఫోన్ ఆపరేటర్ల నెట్వర్క్ను ఆధారంగా చేసుకుని ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని ఈ యాప్ అందిస్తోంది. కొత్తగా తెచ్చిన ఈ సదుపాయంతో వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో పది లక్షల మంది కస్టమర్లను సంపాదించుకోవాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది.
టెలికాం కంపెనీల ఎస్టిడి చార్జీలు భిన్నంగా ఉంటాయని, తాము మాత్రం దేశంలోని ఏ లాండ్లైన్కు లేదా మొబైల్ ఫోన్కు చేసినా ఒకే ధరను వసూలు చేస్తామని రింగో వ్యవస్థాపకుడు, సిఇఒ భవిన్ తెరఖియా తెలిపారు. రోమింగ్ చార్జీలు, టాపప్ కార్డులు, ఇతర కార్డుల అవసరం లేకుండా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విఒఐపి అప్లికేషన్లు కాల్స్ కోసం ఇంటర్నెట్ డేటాను వినియోగించుకుంటాయని, తమ యాప్ మాత్రం ఇంటర్నెట్ అవసరం లేకుండానే కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more