ఆ ఇ:టికి కన్నెం వేసేందుకు కలసి వచ్చినట్లు వుంది అందుకే ఆ దొంగ ఏకంగా నెల రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు దొంగతనానికి పాల్పడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే మళ్లీ చేయాలనుకుని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఒకసారి దొంగతనం చేసిన ఇంటికే మళ్లీ కన్నం వేసి.. తన పశ్చాతాపాన్ని వెలిబుచ్చాడు. అదెలా అంటారా..? ‘సారీ’ అంటూ గోడపై రాసి మరీ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని బీఎన్రెడ్డి కాలనీ ప్లాట్ నెం.36లో వ్యాపారి ప్రదీప్ రంగనాథన్ దంపతులు ఉంటున్నారు. గతనెల 31న వీరింట్లో దొంగ చొరబడి... బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు దోచుకెళ్లాడు. గోడపై ‘సారీ’ అంటూ రాసి ఉడాయించాడు. బాధితుడి ప్రదీఫ్ రంగనాథన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే... బుధవారం రాత్రి అదే దొంగ మళ్లీ అదే ఇంట్లోకి ప్రవేశించాడు. విలువైన ఆభరణాలతో పాటు రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లాడు. సరిగ్గా మొదటిసారి రాసిన చోటే మరోసారి ‘సారీ’ అంటూ రాసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చిందీ ఒకే దొంగని తేలింది. ఒకసారి దొంగలించిన ఇంటిలో మరోసారి దొంగతనానికి పాల్పడి ఇంటి యజమానికి సవాల్ విసురుతున్నాడా..? లేక స్థానిక పోలీసులకు దొంగ సవాల్ విసురుతున్నాడా అన్నది మాత్రం అర్థంకాకుండా వుంది. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అప్పుడు కానీ దొంగ ఎవరో.. పశ్చాతపం ఎందుకో అన్నవిషయాలు వెలుగులోకి రావు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more