చత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యం మరోమారు భయటపడింది. సాధారణ వ్యక్తులు పక్కవాడి వాహనాన్ని ఢీకోంటే.. పిర్యాది దారు కన్నా ముందుగా స్పందించి అవతలి వ్యక్తి నుంచి ముక్కు పిండి డబ్బలు వసూలి చేసి ఆనక రాజీకుదుర్చతామని తమ నైజాన్ని ప్రదర్శించే పోలీసులు.. రాయ్ పూర్ లో ఓ ఉన్నతాధికారి సతీమణి చేసిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయినా నిర్లక్యం వహించారు. సెక్యూరిటీ గార్డు ప్రాణాలు పోయినా పోలీసులు స్పందించకపోవడంతో స్థానికులు సిసిటీవీ ఫూటేజ్ ని మీడియాకు అందించారు.
చత్తీస్ గడ్ లోని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ సీనియర్ అధికారి భార్య క్షత్రియ నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ సెక్యూరిటీ ప్రాణాలు బలిగొంది. రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకున్నా.. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టుల విషయంలో మాత్రం మీనమేశాలు లెక్కపెడుతూ కూర్చుకున్నారు. దీంతో ఒళ్లు మండిన కొందరు స్థానికులు.. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై వుంటుందని తెలుసుకుని ఆ పూటేజీను మీడియాకు అందించారు.
సిసిటీవీ ఫూటేజ్ చూసేవారి ఒళ్లు జలదరించేలా ఉంది. రాయ్ పూర్ లోని రాజేంద్ర నగర్ కాలనీలో ఓ సెక్యూరిటీ గార్డు విధుల్లో ఉండగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్ అధికారి భార్య నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది. అమె కారును రివర్స్ లో అత్యంత వేగంగా నడపింది. వెనుకాల ఎవరు ఉన్నారో అని కూడా చూసుకోకుండా అతి వేగంతో. కారు సరాసరి వెళ్లి సెక్యూరిటీగార్డును ఢీకొట్టింది. అతడిని కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ అధికారి భార్యపై పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more