అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో ఓ యువకుడు చేసిన తెలివితక్కువ పనికి.. వధూవరుల బంధువుల మధ్య భారీ ఘర్షణకు దారితీసింది. విందులో తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ఆగ్రహించిన ఆ యువకుడు.. తన ప్లేటులో విసిరేశాడు. అది పెళ్ళి కూతురు తరఫున బంధువులపై పడటంతో అతనిని చితకబాదారు. ఆ విషయం తెలుసుకున్న ఆ యువకుడి బంధువులు మూకుమ్మడిగా వాడిపై దాడి చేశారు. ఈ విధంగా రెండువర్గాల మధ్య గొడవ జరిగింది.
శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ అనే వ్యక్తికి బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. అప్పటివరకు అక్కడి వాతావరణం ఓ పండుగలా వుండేది. బంధువులు అందరూ సరదాగా గడిపారు. కానీ.. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ఆగ్రహావేశంతో ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ఆ ప్లేటు.. పెళ్లికూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన వారు.. అతన్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల వారు తమతమ వారిని కొడుతున్నారంటూ ఆగ్రహానికి గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఈ గొడవ మరింత చిలికి పెద్దగా కాకూడన్న భావనతో.. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. దాంతో ఆ వివాదానికి తెరపడిందని అంతా అనుకున్నారు కానీ.. అలా జరగలేదు.
శుక్రవారం మధ్యాహ్నం తిరిగి మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి, సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడున్న కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన కొందరు తీవ్ర గాయాలపాలవ్వగా.. మరొక వ్యక్తి వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు.. అదనపు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more