14 ఏళ్ల క్రితం.. ఓ మైనర్ అమ్మాయి ఇంటినుంచి కాలేజీకి బయలుదేరింది.. సాయంత్రం ఎంతసేపైనా ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.. ఆమె ఆచూకీ కోసం స్నేహితులందరినీ సంప్రదించగా.. చివరకు ఆమె కిడ్నాప్ కు గురైందని తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించగా.. అప్పటినుంచి ఆ అమ్మాయి కోసం వేట ప్రారంభించారు. అలా 14 ఏళ్ల తర్వాత పోలీసులకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వ్యక్తి దొరికాడు. అతనిని అరెస్ట్ చేసి విచారించగా.. ఎవరూ ఊహించని విషయం బయటపడింది. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న అప్పటి మైనర్ అమ్మాయి మీనాక్షిని రాజేష్ పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికీ పదేళ్ల కొడుకు ఉన్నాడని పోలీసులకు తెలిసింది.
14 ఏళ్లక్రితం.. మీనాక్షి (17) అనే అమ్మాయి వారింట్లో రాజేష్ అనే యువకుడు అద్దెకు వుండేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తామిద్దరం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కూడా. అయితే.. రాజేష్ తక్కువ కులానికి చెందినవాడు కావడంతో.. వారిద్దరికి వివాహం జరిపించడం ఆమె తండ్రికి ఇష్టం లేకపోయింది. దీంతో.. మీనాక్షి, రాజేష్ సీక్రెట్ గా ఓ ప్లాన్ రచించి.. ఇంటి నుంచి అమృత్ సర్ వెళ్ళిపోయారు. దీంతో కోపాద్రిక్తుడైన ఆమె తండ్రి.. రాజేష్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఇక అప్పటినుంచి పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత విసిగిపోయిన పోలీసులు.. రాజేష్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు బహుతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా! కానీ.. ఏమాత్రం ఫలితం లేకపోయింది. అటువైపు.. వారిద్దరూ తమ దాంతప్య జీవితాన్ని బాగానే గడుపుతున్నారు. అయితే.. మీనాక్షి మాత్రం పోలీసుల పేరు వినగానే భయపడేది. ఎక్కడ తనని తిరిగి ఇంటికి తీసుకెళ్తారోనన్న భయంతో బయటకు తిరిగేది కూడా కాదు. అయితే.. కొడుకు పుట్టిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయని భావించింది. ఇలా పద్నాలుగేళ్ళు గడిచిపోగా.. ఇప్పుడు వారికి పదేళ్ళ కొడుకు వున్నాడు. ఇక తమ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవని మీనాక్షి దంపతులు అనుకున్నారు కానీ.. ఇంతలోనే వారికి షాక్ తగిలింది.
ఎట్టకేలకు వీరి ఆచూకీ తెలుసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాజేష్ ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న మీనాక్షి.. భర్తను విడిపించేందుకు కొడుకుతో ఢిల్లీకి చేరింది. అక్కడికి చేరి పోలీసులకు మొత్తం వివరించగా.. వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే.. కిడ్నాప్ కేసు కావడంతో రాజేష్ ని కోర్టులో హాజరుపరచక తప్పలేదు. కోర్టులో దాదాపు గంటసేపు విచారణ జరిగింది. చివరగా.. మీనాక్షి స్టేట్మెంట్ను జడ్జి విశ్వసించి.. రాజేష్కు బెయిలు మంజూరు చేశారు. అయితే.. రాజేష్ కు బెయిలు మంజూరు చేయడంపై మీనాక్షి కుటుంబసభ్యులు ముఖ్యంగా ఆమె తండ్రి అశోక్ శర్మ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more