ఇటీవలే జరిగిన ఓ చిన్నారి కిడ్నాప్ ఉదంతం మరో కీలక మలుపు తిరిగింది. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిన ముఠాలో ఇంకా ఎందరో సభ్యులు వున్నారని, వారంతా ఓ పెద్ద వ్యభిచార రాకెట్ ని నడుపుతున్నారన్న షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిని పెంచిపెద్దచేయడం, అనంతరం వారితో వ్యభిచారం చేయించడం లాంటి కార్యకలాపాలు ఆ ముఠా చేయిస్తోందని పోలీసులకు వెల్లడైంది. ఈ నిజాలు తెలుసుకున్న పోలీసులు.. వెంటనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యభిచారం ముఠాలో ఇద్దరు పురుషులు వుండగా.. ఐదుగురు మహిళలే వున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 5న కాకినాడకు చెందిన రాణి కూతురిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దుర్గ అనే ఓ మహిళ ఎత్తుకెళ్లింది. తన కూతురు కిడ్నాప్ కు గురైందన్న విషయం తెలుసుకున్న రాణి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఆమె ఆచూకీ ఎక్కడుందో వెంటనే కనుక్కొని ఆమెను పట్టుకున్నారు. అనంతరం కిడ్నాప్ కు గురైన బాలికను ఆమె తల్లికి క్షేమంగా అప్పగించారు. అనంతరం ఈ కిడ్నాప్ ఎందుకు చేశావంటూ పోలీసులు నిందితురాలని ప్రశ్నించగా.. ఆమె కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెల్లడించింది. ఈ విచారణలో తాము గుట్టుగా నడిపే సెక్స్ రాకెట్ వ్యవహారాలను ఆమె వెల్లడించింది.
మెదక్ జిల్లా జిన్నారంలోని బాలాజీనగర్కు చెందిన బొంతల కుమార్(24) సికింద్రాబాద్ రైల్వే, బస్టేషన్ల వద్ద మాటు వేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చే యువతులు, చిన్నారులను గుర్తిస్తాడు. తమ గ్యాంగ్లోని సభ్యురాలు పద్మావతి అలియాస్ సునీత(26) సహకారంతో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన చిన్నారులను ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీయిస్తాడు. వారిని యాదగిరిగుట్ట సుభాష్నగర్కు చెందిన కంసాని శంకర్(51)కి అమ్మేస్తాడు. శంకర్ తన భార్య దివ్య సహకారంతో వ్యభిచార గృహాలు నడిపే కోడెం బేగమ్మ(60), మేకల బూస(55), చింతల కమలమ్మ(48)లకు వారిని కొంత మొత్తానికి అమ్మేస్తాడు. యువతులతో ప్రతిరోజూ వ్యభిచారం చేయిస్తూ వచ్చిన డబ్బులో కొంత కమిషన్ తీసుకుంటాడు.
ఇలా ఈ విధంగా వీరు సాగిస్తున్న ఈ వ్యభిచార రాకెట్.. బాలిక కిడ్నాప్ ఉందంతం బట్టబలు చేసింది. యాదగిరిగుట్ట కేంద్రంగా వీరు వివిధ జిల్లాల్లో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుర్గ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు వైష్ణవి(5) అనే మరో పాప కూడా దొరికింది. వైష్ణవిని కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండునెలల క్రితం కుమార్ కిడ్నాప్ చేసి శంకర్కు అమ్మేశాడు. ఆ దుర్మార్గుల నుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో రెస్క్యూహోంకు తరలించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more