ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారిని వెలి వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంటులోని రాయల్ గ్యాలరీలో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకతాటికి రావాల్సిన అవశ్యకత వుందన్నారు. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యస్వరాన్ని విన్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుదేశాల్లోని భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చేందుకు భారత, బ్రిటన్ భద్రతాసంస్థలు కలిసి పనిచేయాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిటన్ పార్లమెంటు భవన సముదాయంతో ఆధునిక భారతదేశ చరిత్రకు విడదీయరాని బంధం ఉందన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించిన నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు ఎందరో బ్రిటన్ పార్లమెంటుతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. పార్లమెంటు సమావేశాలు లేకున్నా తన కోసం రాయల్ కోర్టు ద్వారాలు తెరిచినందుకు కామన్స్ స్పీకర్ జాన్ బెర్కోవ్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
‘బ్రిటన్ పార్లమెంటు వద్ద గాంధీ విగ్రహం ఉండటం ఎలా సాధ్యమైందని ఒకరు తనను ప్రశ్నించారని అన్నారు. దానికి తాను సమాధానం ఇస్తూ.. గాంధీ గొప్పతనాన్ని గుర్తించడం ద్వారా బ్రిటీషర్లు తమ వివేకాన్ని చాటుకుంటే.. గాంధీని వారితో పంచుకోవడం ద్వారా భారతీయుల తమ ఔన్నత్యాన్ని వెల్లడించారని సమాధానం ఇచ్చానని మోదీ వివరించారు. ప్రపంచానికి భారత గొప్ప ఆశాకిరణంగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత్ ను సందర్శించి మార్పులు గమనించవచ్చంటూ ఆహ్వానం పలికారు. గత ఎన్నికల సమయంలో తాను కెమెరాన్కు ఓ నినాదాన్ని ఇచ్చానన్నారు. ‘ఫిర్ ఏక్ బార్.. కెమెరాన్ సర్కార్’ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్లి విజయం సాధించారు. దానికి తనకు రాయల్టీ ఇవ్వాల్సి ఉందని చలోక్తి విసిరి నవ్వుల పువ్వులు పూయించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more